నిజ నిర్ధారణ: AAP బ్యానర్ మార్ఫిడ్ ఫోటో తప్పుడు క్లయిమ్తో వైరల్ అయింది
విశ్వాస్ న్యూస్ తన పరిశోధనలో ఈ వాదన తప్పు అని గుర్తించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఈ వైరల్ బిల్బోర్డ్ ట్యాంపర్ చేయబడింది.
- By Vishvas News
- Updated: April 21, 2022

విశ్వాస్ న్యూస్ (న్యూఢిల్లీ). “ఇప్పుడు గుజరాత్ నమాజ్ చేస్తుంది” అని గుజరాతీ భాషలో వ్రాసిన AAP బ్యానర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో. భగవత్ సప్తః, సత్యనారాయణ కథ వంటి పనికిమాలిన సంప్రదాయాలను ప్రజలు విడనాడాలని బ్యానర్ బటన్పై వ్రాసి ఉంది. విశ్వాస్ న్యూస్ తన విచారణలో ఈ వాదన తప్పు అని తేల్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఈ వైరల్ బిల్బోర్డ్ ట్యాంపర్ చేయబడింది.
ఏం వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ వినియోగదారు భాస్కర్ ఉపాధ్యాయ వైరల్ బ్యానర్ ఫోటోను పోస్ట్ చేసి, “గుజరాత్లోని ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్ను చూడండి…..మీకు గుజరాతీ అర్ధం కాకపోతే నేను చెబుతాను…..అని వ్రాశారు….గుజరాత్ నమాజ్ చదువుతుంది, భగవత్ సప్తః మరియు సత్యనారయణ కథ లాంటి అర్ధంలేని మాటలు వదిలేయండి !!……..# సిగ్గుమాలిన కేజ్రీవాల్.
విచారణ –
వైరల్ పిక్చర్లో నిజమెంతో తెలుసుకోవడానికి, మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా ఫోటోను పరిశోధించాము. మేము 10 జూలై 2021న ఆమ్ ఆద్మీ పార్టీ డాంగ్ జిల్లా ట్విట్టర్ హ్యాండిల్లో అసలైన ఫోటోని చూశాము. అదే విధమైన బ్యానర్ ఇందులో కనిపించింది. ఒరిజినల్ పోస్టర్ మీద ‘మారుతుంది గుజరాత్’ అని రాసి ఉంది. ఈ భాగం వైరల్ ఇమేజ్లో వైరల్ అయిన పదాలతో మార్చబడింది.
అందిన సమాచారం ఆధారంగా, మేము కొన్ని కీలకమైన పదాలతో గూగుల్లో వెతికాము. మాకు 12 జూలై 2021న గుజరాత్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఫేస్బుక్ పేజీలో వైరల్ క్లయిమ్కు సంబంధించిన పోస్ట్ కనిపించింది.

క్యాప్షన్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, వైరల్ అయిన ఫోటో తప్పు. చేతులు ముడుచుకుని వైరల్ అయిన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి జర్నలిస్ట్ ఇషుదాన్ గాధ్వి అని మా విచారణలో తెలిసింది.

వైరల్ ఫోటోను ఒరిజినల్తో పోల్చి చూస్తే, అసలు ఫోటో మీద “గుజరాత్ మారుతుంది” అని రాసి ఉందని, దానిని సవరించి “గుజరాత్ నమాజ్ చేస్తుంది” అని మార్చినట్లుగా మేము తెలుసుకున్నాము. అలాగే, భగవత్ సప్తః మరియు సత్యనారాయణ కథ గురించి దిగువన ఒక లైన్ కలపబడింది. వైరల్ ఫోటోలో ముస్లింగా కనిపిస్తున్న వ్యక్తి గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా. వీరి ఫోటో ఎడిట్ చేయబడింది.
మరింతగా తెలుసుకోవడానికి, మేము ఇషుదన్ గాధ్వి PA, వనరాజ్ చావడాని సంప్రదించాము. అతను “వైరల్ క్లయిమ్ తప్పు ఈ ఫోటో చాలా కాలం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. గతేడాది ఈ ఫొటో చాలా వైరల్ అయినప్పుడు, మేము దాని మీద FIR రిజిష్టర్ చేశాము”, అని చెప్పాడు..
తరువాత, వైరల్ పోస్ట్ను షేర్ చేసిన సోషల్ మీడియా యూజర్ ప్రొఫైల్ని స్కాన్ చేశాము. ఫేస్బుక్లో ఆ వినియోగదారుని మూడు వందల మందికి పైగా ఫాలో అవుతున్నారు. అక్టోబర్ 2011 నుండి యూజర్ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ తన పరిశోధనలో ఈ వాదన తప్పు అని గుర్తించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఈ వైరల్ బిల్బోర్డ్ ట్యాంపర్ చేయబడింది.
- Claim Review : గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్ చూడండి…….మీకు గుజరాతీ తెలియకపోతే నేను చెబుతాను.. అని రాసి ఉంది… ……….. …. గుజరాత్ నమాజ్ చేస్తుంది, భగవత్ వారం, సత్యనారయణ కథ వంటి పనికిరాని ధోరణులను విడిచిపెట్టండి!!…………… చూస్తూ ఉండండి ఈసారి గుజరాతీ యుగ్పురుష్ బూట్లతో అవార్డు ఇవ్వబడుతుందని……….# సిగ్గుమాలిన కేజ్రీవాల్ #
- Claimed By : భాస్కర్ ఉపాధ్యయ
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com