వాస్తవ తనిఖీ: ఉపాధ్యాయుల ఈ లోగోకు సుప్రీం కోర్టు ఆమోదం లభించలేదు, వైరల్ క్లెయిమ్ అవాస్తవం
ఉపాధ్యాయుల కార్ల కొరకు ఈ వైరల్ లోగోను సుప్రీంకోర్టు గుర్తించలేదు, ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది.
- By Vishvas News
- Updated: March 11, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ బృందం). ఒక లోగో ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లోగోలో, రెండు అరచేతులమధ్య ఒక పుస్తకము మరియు కలము ఉన్నాయి. ఈ లోగోను సుప్రీంకోర్టు ఆమోదించింది అని ఈ పోస్ట్ లో క్లెయిమ్ చేయబడింది. ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ లోగోను ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ సుప్రీంకోర్టు గుర్తించలేదు.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఈ వైరల్ పోస్ట్ ను జి.కె. విశ్వనాథ్ అనే ఒక ఫేస్బుక్ యూజర్ షేర్ చేశారు. దీనితోపాటు ఆంగ్లములో ఒక శీర్షిక కూడా వ్రాయబడి ఉంది, “ఉపాధ్యాయులందరికి అభినందనలు…ఈ లోగోను మీ కార్ పై వేసుకొనుటకు సుప్రీంకోర్టు ఆమోదించింది….వైద్యులు మరియు న్యాయవాదుల మాదిరిగా….”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేయుటకు, మేము ముందుగా సుప్రీంకోర్టు ఇటువంటిలోగోను దేనినైనా గుర్తించిందా అని ఇంటర్నెట్ పై సెర్చ్ చేశాము. ఎక్కడ కూడా మాకు విశ్వసనీయమైన వార్త కనిపించలేదు. దీని తరువాత, మేము సుప్రీంకోర్టు యొక్క వెబ్సైట్ పై కూడా సెర్చ్ చేశాము. కాని అక్కడ కూడా అటువంటి వార్తలు ఏవి మాకు కనిపించలేదు.
ఆ తరువాత, మేము ఈ లోగో గురించి దర్యాప్తు ప్రారంభించాము. గూగుల్ రివర్స్ సెర్చ్ ఇమేజ్ టూల్ సహాయముతో ఈ లోగోను సెర్చ్ చేసినప్పుడు, మేము టీచర్ లోగో అని పేరుగల ఒక ఫేస్బుక్ పేజ్ ను కనుగొన్నాము, దీనిపై ఈ లోగో పోస్ట్ చేయబడి ఉంది. ఈ పేజ్ పై, కొంత మంది తమ కార్లపై ఈ లోగోను అతికించుకుంటూ ఉన్న ఫోటోలు మరియు ఈ ‘లోగో’ చిత్రాన్ని తన చేతులలో పట్టుకొని కొంతమంది నిలుచున్న గ్రూప్ ఫోటోలు కనిపించాయి.
ఆ తరువాత, కొంతమంది కామర్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ఫౌండేషన్ యొక్క వెబ్సైట్ పై ఈ లోగోను ప్రెజెంట్ చేస్తూ ఉన్న చిత్రాన్ని మేము కనుగొన్నాము, దీని వెనుక పంజాబీలో: లోగో సృష్టికర్త: శ్రీ. రాజేష్ ఖన్నా, ప్రిన్సిపల్ అని వ్రాసి ఉంది.
మేము కీవర్డ్స్ తో దర్యాప్తు చేసి ఈ లోగోను ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్, కాసాబాద్, లూథియానా, పంజాబ్ యొక్క ప్రిన్సిపల్ అయిన రాజేష్ ఖన్నా గారు 2017లో రూపొందించారు అని కనుగొన్నాము.
దీనికి సంబంధించి మేము ఖన్నా గారిని సంప్రదించాము. ఆయన ఈ లోగోను ఉపాధ్యాయులకు అంకితం చేయుటకు రూపొందించానని చెప్పారు. అలాగే ఏ విధంగా వైద్యులు, న్యాయవాదులు, సిఏలకు తమ సొంత లోగో కలిగి ఉన్నారో మరియు ఎలా వారు గర్వంగా వాటిని తమ కారుపై వేసుకుంటారో, అదే విధంగా ఉపాధ్యాయులకు కూడా ఒక లోగో ఉండాలని, తద్వారా ఉపాధ్యాయులకు గుర్తింపు కూడా వస్తుందని నేను ఆలోచించే వాడిని అని, కాని దీనికి సుప్రీంకోర్టు ఆమోదం ఉంది అనేది అసత్యము. ఇంకా అటువంటిది ఏది లేదు. తొందరలోనే అలా జరగాలని ఆశిస్తున్నాను” అని ఆయన చెప్పారు.
ఈ పోస్ట్ ను ఫేస్బుక్ పై “జి.కె. విశ్వనాథ్” ద్వారా షేర్ చేయబడింది. ఈ యూజర్ యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేసినప్పుడు, అతను చెన్నై నివాసి అని మాకు తెలిసింది.
निष्कर्ष: ఉపాధ్యాయుల కార్ల కొరకు ఈ వైరల్ లోగోను సుప్రీంకోర్టు గుర్తించలేదు, ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది.
- Claim Review : ఉపాధ్యాయులందరికి అభినందనలు…ఈ లోగోను మీ కార్ పై వేసుకొనుటకు సుప్రీంకోర్టు ఆమోదించింది….వైద్యులు మరియు న్యాయవాదుల మాదిరిగా
- Claimed By : Viswanath
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com