వాస్తవ తనిఖీ: జియో సంస్థ రూ. 10,000 వరకు బహుమతి ఇవ్వడము లేదు, షేర్ చేయబడిన లింక్ నకిలీది
- By Vishvas News
- Updated: January 11, 2023

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): జియో సంస్థ రూ. 10,000 వరకు బహుమతిని అందిస్తోందని క్లెయిమ్ చేసే ఒక సందేశము సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతోంది. ఈ సందేశములో ఒక యూఆర̴్ఎల్ ఉంది, ఇందులో అందుకున్న వారు దీనిపై క్లిక్ చేస్తే తమ ఖాతాలలోకి డబ్బు బదిలీ చేయబడుతుందని చెప్పబడింది.
ఈ వైరల్ పోస్ట్ ను విశ్వాస్ న్యూస్ వాస్తవ-తనిఖీ చేసింది, మరియు ఈ సందేశము ఒక కుంభకోణం అని తేలింది. ఇటువంటి సందేశాలను ఎప్పుడు నమ్మకండి. ఇటువంటి లింక్స్ పై పొరపాటున కూడ క్లిక్ చేయకూడదని నిపుణులు చెప్తున్నారు.
క్లెయిమ్:
ఫేస్బుక్ యూజర్ ‘దేవా జీనియస్’ జనవరి 2వ తేదీన ఒక లింక్ షేర్ చేశారు మరియు ‘కొత్త సంవత్సరపు ఆఫర్’ అని వ్రాశారు. ఈ పోస్ట్ లో, లింక్ వెంబడి, ఇలా వ్రాయబడింది, “జియో ప్రతి ఒక్కరికి రూ. 10,000 వరకు బహుమతి ఇస్తోంది. డబ్బును మీ ఖాతాలోకి అందుకొనుటకు క్లిక్ చేయండి’
ఇదే పోస్ట్ ఫేస్బుక్, ట్విట్టర్ మరియు వాట్సాప్ లపై కూడా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ముందుగా వైరల్ పోస్ట్ లో ఉపయోగించబడిన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ను కనుగొన్నారు. దీని చూసినప్పుడు, ఇది ఒక మోసపూరితమైన వెబ్సైట్ కు లింక్ అని అర్థంఅయ్యింది, ఎందుకంటే దీని చివరిలో dot com or dot in బదులు dot XYZ అని ఉపయోగించబడింది. అందుకే మేము ఈ యూఆర్ఎల్ పై క్లిక్ చేయలేదు. నిజాన్ని కనుగొనుటకు, మేము నేరుగా జియో వారిని సంప్రదించాము.
ఇటువంటి సందేశాలు జియో పేరున వైరల్ అవుతూ ఉంటాయని ఫ్రాంకో విలియం, వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్, విశ్వాస్ న్యూస్ వారికి తెలియజేశారు. దీనిలో ఎలాంటి వాస్తవం లేదు. ప్రజలు ఇటువంటి సందేశాలను పట్టించుకోకూడదని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా నకిలీ సందేశము అని ఆయన చెప్పారు.
ఇటువంటి సందేశాల గురించి సైబర్ నిపుణులు చాలాసార్లు హెచ్చరించారు. సైబర్ నేరస్థులు మోసం చేయటానికి కొత్త కొత్త మార్గాలను కనుగొంటున్నారని సైబర్ నిపుణుడు అనూజ్ అగర్వాల్ విశ్వాస్ న్యూస్ కు చెప్పారు. వాళ్ళు ప్రజలను ఆఫర్స్ పేరున ఉసిగొల్పి వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. మనము ఇలా హడావిడిలో అనుమానాస్పదమైన లింక్ పై క్లిక్ చేయకూడదు. మన భద్రత మన చేతిలోనే ఉంది.
ఒకవేళ ఒక సంస్థ ఇటువంటి ఆఫర్స్ ను అందిస్తే, దాని గురించి అది ఖచ్ఛితంగా తన సోషల్ మీడియా లేదా వెబ్సైట్ పై సమాచారం అందిస్తుంది. మనము అక్కడికి వెళ్ళి పరీక్షించాలి.
మీ సమాచారాన్ని ఎక్కడా ఇవ్వకండి. దీని వలన మీ సమాచారము దొంగిలించబడవచ్చు. ఇటువంటి పోస్టుల గురించి తెలియజేయండి.
దర్యాప్తు చివరిలో, ఫేస్బుక్ యూజర్ ‘దేవా జీనియస్’ ను విచారించాము. ఈ యూజర్ నకిలీ సందేశాన్ని జియో పేరున పోస్ట్ చేశారు.
4.8 వేలమంది ఈ యూజర్ ను ఫాలో అవుతున్నారు, ఈయన రేణుకూట్, యూపి నివాసి. ఈ ఖాతా డిసెంబరు 2021 న సృష్టించబడింది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో, జియో పేరున ఉన్న ఈ వైరల్ సందేశము నకిలీది అని తేలింది. ఈ కంపెనీ రూ. 10,000 వరకు బహుమతిని ఇవ్వడము లేదు.
- Claim Review : జియో ప్రతి ఒక్కరికి రూ. 10,000 వరకు బహుమతి ఇస్తోంది
- Claimed By : దేవా జీనియస్
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com