వాస్తవ తనిఖీ : రెండేళ్ల క్రితం నాటి అల్వార్ ఘటన మరోసారి తప్పుడు వాదనతో వైరల్
వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది. 2018 నవంబర్లో జరిగిన ఆత్మహత్య సంఘటన ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
- By Vishvas News
- Updated: October 1, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : నిరుద్యోగం కారణంగా జరిగిన ఆత్మహత్య సంఘటనకు సంబంధించిన వార్తాపత్రిక క్లిప్పింగ్.. ఇటీవల జరిగినదిగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న సమయంలో మీడియా మాత్రం సుశాంత్ ఆత్మహత్య కేసునే ప్రధానంగా చూపిస్తోందంటూ ఆ యూజర్ ఆరోపించారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుదారి పట్టించేదని వెల్లడయ్యింది. 2018 లో జరిగిన అప్పటి ఆత్మహత్య సంఘటనకు సంబంధించిన వార్తాపత్రిక క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
దావా :
ఫేస్బుక్ యూజర్ అంకిత్ తివారీ, సెప్టెంబర్ 5వ తేదీన ఈ వార్తాపత్రిక క్లిప్పింగ్ను అప్లోడ్ చేశారు. ‘చాలా విచారకరమైన సంఘటన. దేశ యువత చాలా కలత చెందుతోంది. నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. కానీ, దేశంలోని మీడియా మాత్రం సుశాంత్ కేసులో నిమగ్నమై ఉంది.’ అని ఆ పోస్ట్లో కామెంట్ చేశారు.
వైరల్ పోస్ట్ ఇక్కడ చూడవచ్చు.
వైరల్ అవుతున్న పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
తొలుత మేము వార్తల క్లిప్పింగ్ను గమనించడం జరిగింది. ఈ సంఘటన రాజస్థాన్లోని అల్వార్కు చెందినదని తెలుసుకున్నాం. ఈ వార్త రాజస్థాన్ పత్రికకు సంబంధించిన క్లిప్పింగ్. మేము కీలకపదాలను ఉపయోగించి గూగుల్లో శోధించాము. ఈ శోధనలో మేము patrika.com నుండి మొదటి లింక్ను గుర్తించాము. 21 నవంబర్ 2018 న ఆ వెబ్సైట్లో ప్రచురించిన అదే వార్తను మేము కనుగొన్నాము. ఆ వార్తా కథనం ప్రకారం, అల్వార్లో నలుగురు యువకులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
మేము ఈ వార్తను జీ న్యూస్ వెబ్సైట్లో కూడా కనుగొనడం జరిగింది. 22 నవంబర్ 2018 న ప్రచురించబడిన వార్తాకథనంలో… ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తాపత్రిక క్లిప్పింగ్లో ఉన్న అవే నాలుగు ఫోటోలను మేము కనుగొన్నాము.

ఈ దావాను ధృవీకరించడానికి మేము దైనిక్ జాగరణ్ యొక్క జైపూర్ ఇంచార్జ్ నరేంద్ర శర్మను సంప్రదించాము. ‘ఇది ఇటీవలి సంఘటన కాదు. ఈ కేసు 2018 నాటిది’ అని శర్మ ధృవీకరించారు.
వైరల్ పోస్ట్ను షేర్ చేసిన యూజర్ ప్రొఫైల్ను సోషల్ స్కానింగ్ చేయడం జరిగింది. స్కానింగ్లో ఆ యూజర్ యూపీలోని గోండాకు చెందినవాడు అని తేలింది.

निष्कर्ष: వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది. 2018 నవంబర్లో జరిగిన ఆత్మహత్య సంఘటన ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
- Claim Review : నిరుద్యోగం కారణంగా జరిగిన ఆత్మహత్య సంఘటనకు సంబంధించిన వార్తాపత్రిక క్లిప్పింగ్.. ఇటీవల జరిగినదిగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
- Claimed By : ఫేస్బుక్ యూజర్ అంకిత్ తివారీ
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com