వాస్తవ తనిఖీ: ఈ చిత్రము పాతము మరియు దీనికి లాక్డౌన్-వ్యతిరేక నిరసనకు ఎలాంటి సంబంధం లేదు
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు సమయములో, వైరల్ ఫోటో గురించి చేసిన దావా నకిలీది అని కనుగొనబడింది. అప్పటి అల్జీరియా ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు ఒక అసత్య క్లెయింతో షేర్ చేయబడింది.
- By Vishvas News
- Updated: May 13, 2021

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): సోషల్ మీడియాలో నిరసనకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రము కరోనావైరస్ లాక్డౌన్ కు వ్యతిరేకంగా విదేశాలలో జరుగుతున్న ప్రదర్శనకు సంబందించిన చిత్రముగా చెప్పబడుతోంది. ఈ ఫోటో ద్వారా, భారతదేశములో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న సమయములో తీసుకోబడుతున్న చర్యలు విమర్శించబడుతున్నాయి.
విశ్వాస్ న్యూస్ వారి దర్యాప్తులో, వైరల్ అయిన చిత్రము గురించి చేయబడిన దావా నకిలీది అని కనుగొనబడింది. అప్పటి అల్జీరియా ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంబంధించిన ఈ ఫోటో ఒక అసత్యమైన దావాతో ఇప్పుడు షేర్ చేయబడింది.
భారతదేశములో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి మరియు ప్రజా కదలికలపై అనేక ఆంక్షలు విధించడం ద్వారా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనావైరస్ ఇన్ఫెక్షన్ గొలుసును విచ్ఛేదనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
క్లెయిం
ఆశిష్ సింగ్ అనే ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వైరల్ ఫోటోను ఏప్రిల్ 23, 2021 నాడు “విదేశాలలో లాక్డౌన్ ఈ విధంగా బహిష్కరించబడుతోంది మరియు ఇక్కడ లాక్డౌన్ కొరకు నిరీక్షిస్తున్నారు, దైవమే యజమాని” అని వ్రాసి షే చేశారు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ వారు ఫోటో తనిఖీ కొరకు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించారు. ఇంటర్నెట్ పై ఆ ఫోటోకు సంబంధించి అనేక ఫలితాలు లభించాయి. నవంబర్ 20, 2020 నాడు dubawa.org పై ప్రచురించబడిన ఒక నివేదిక మాకు లభించింది. ఆ నివేదిక ప్రకారం ఈ చిత్రము అల్జీరియా ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2019లో ప్రారంభమైన నిరసనకు సంబంధించినైద్.
ఇక్కడ క్లిక్ చేయడము ద్వారా ఆ నివేదికను చూడవచ్చు.
ఈ నివేదిక నుండి మాకు లభించిన క్లూ ప్రకారము, మేము ఈ చిత్రము గురించి మరింత శోధించాము. ఈ చిత్రము మార్చ్ 13, 2019 నాడు islam21c.com పై ప్రచురించబడిన నివేదికలో కూడా లభించింది. ఈ నివేదికలో కూడా ఈ చిత్రము ఫిబ్రవరి 2019లో అల్జీరియా (లజీరియన్ స్ప్రింగ్) లో ప్రారంభమైన ఉద్యమానికి సంబంధించినది అని వివరించబడింది. ఇక్కడ క్లిక్ చేసి ఆ నివేదికను చూడవచ్చు.
ప్రపంచములో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ యొక్క మొదటి కేస్ నివేదిక (డిసెంబర్ 2019) కంటే ముందుగానే ఈ చిత్రము ఇంటర్నెట్ పై ఉందని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఇది అల్జీరియా రాజకీయ ఉద్యమానికి సంబంధించిన కాని కరోనావైరస్ లాక్డౌన్ కు సంబంధించినది కాదు. తదుపరి ధృవీకరణ కొరకు విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ చిత్రాన్ని అల్జీరియా టుడే విలేఖరికి షేర్ చేశాము. ఈ ఫోటో అల్జీరియాలో 2019లో జరిగిన డైమండ్ మూవ్మెంట్ (అధికార మార్పు కొరకు చేసే ఉద్యమము పేరు) సమయములో తీసిన ఫోటో అని ఆయన కూడా ధృవీకరించారు. దీనికి కరోనావైరస్ లాక్డౌన్ కు ఎలాంటి సంబంధం లేదు.
ఈ వైరల్ ఫోటోను పోస్ట్ చేసిన ఫేస్బుక్ యూజర్ ఆశిష్ సింగ్ యొక్క ప్రొఫైల్ ను విశ్వాస్ న్యూస్ స్కాన్ చేసింది. ఆ యూజర్ తన ప్రొఫైల్ పై సమాచారాన్ని జనాంతికం చేయలేదు
निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు సమయములో, వైరల్ ఫోటో గురించి చేసిన దావా నకిలీది అని కనుగొనబడింది. అప్పటి అల్జీరియా ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు ఒక అసత్య క్లెయింతో షేర్ చేయబడింది.
- Claim Review : विदेशों में इस तरह लॉकडाउन का बहिष्कार हो रहा है और यहां तो लॉकडाउन का इंतजार हो रहा है,भगवान मालिक है सब राम भरोसे चल रहा है।
- Claimed By : आशीष सिंह
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com