Fact Check: కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని విభజిస్తోందని ప్రధానమంత్రి ఆరోపించారు, వైరల్ క్లిప్ ఎడిట్ చేయబడినది
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది. ఈ వీడియో డిజిటల్ గా ఎడిట్ చేయబడింది మరియు రాజకీయ ప్రచారం కోసం దానిలోని అసలైన సందర్భం తీసివేయబడింది. అసలైన వీడియోలో, ప్రధానమంత్రి ఈ సూచన చేస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించారు.
- By: Ashish Maharishi
- Published: Feb 17, 2026 at 05:39 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ‘సమాజాన్ని విభజించి అధికారాన్ని చేజిక్కించుకోవడం తన ఆశయంగా అంగీకరించారు అనే క్లెయిమ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది.”
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది. ఈ వీడియో డిజిటల్ గా ఎడిట్ చేయబడింది మరియు రాజకీయ ప్రచారం కోసం దానిలోని అసలైన సందర్భం తీసివేయబడింది. అసలైన వీడియోలో, ప్రధానమంత్రి ఈ సూచన చేస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించారు.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ యూజర్ శైలేంద్ర పాండే‘ ఈ వీడియో క్లిప్ ను ఫిబ్రవరి 12, 2026 నాడు, “స్నేహితులారా, ఆయన ఆశయం ఒక్కటే: సమాజాన్ని విభజించాలి, విభజించి పాలించాలి. బిగ్గరగా చెప్పండి, హర్ హర్ మోయ్….విశ్వగురు నుండి విష్గురు వరకు ప్రయాణం” అనే క్లెయిమ్ తో అప్లోడ్ చేశారు.
ఎడిట్ చేయబడిన ఈ క్లిప్ సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు
ఫుటేజ్ యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము ముందుగా అనేక స్క్రీన్ షాట్స్ తీసుకున్నాము మరియ్ గూగుల్ లెన్స్ ఉపయోగించి వాటిని సెర్చ్ చేశాము. దీని ద్వారా మాకు వార్తా ఏజెన్సీ అయిన ANI యొక్క X హ్యాండిల్ పై వైరల్ క్లిప్ యొక్క అసలైన వీడియో లభించింది.
అక్టోబరు 5, 2024 నాడు 1:18 నిమిషాల నిడివి కలిగిన వీడియోను పోస్ట్ చేస్తూ, ANI ఇలా వ్రాసింది, #వాచ్ థానె, మహారాష్ట్ర: ప్రధాని మోదీ ఇలా అన్నారు, “వారి వోటు బ్యాంకు ఐక్యంగా ఉంటుంది, కాని ఇతరులు దానిని విడగొడతారని కాంగ్రెస్ కు తెలుసు. కాంగ్రెస్ మరియు దాని కూటమి పార్టీలకు ఒకే ఆశయం ఉంది: సమాజాన్ని విభజించు మరియు అధికారాన్ని చేజిక్కించుకో. అందుచేత, మన ఐక్యత జాతికి కవచం మాదిరిగా ఉండాలి. మనము విడిపోతే, విభజించే వాళ్ళు ఒక్కటౌతారు. కాంగ్రెస్ మరియు కూటమి వర్గాల ప్రణాళికలను మనము గెలవనివ్వకూడదు…….”
వైరల్ క్లిప్ లో “కాంగ్రెస్ మరియు దాని కూటమి పార్టీలు” అనే ప్రస్తావనను తొలగించబడి, ప్రధానమంత్రి తన సొంత ప్రభుత్వము లేదా పార్టీ గురించి ప్రస్తావిస్తున్నారు అనిపించేలా ఎడిట్ చేయబడింది.
ANI, నవభారత్ టైమ్స్, జీ న్యూస్, మరియు జాగరణ్ సహా అనేక వార్తా ఛానళ్ళు అక్టోబరు 2024లో ఈ ప్రసంగము గురించి రిపోర్ట్ చేశాయి. అన్ని రిపోర్ట్లు ప్రధానమంత్రి వ్యాఖ్యలు ప్రతిపక్షము యొక్క రాజకీయ వ్యూహము గురించి విమర్శలని ధృవీకరించాయి.
విశ్వాస్ న్యూస్ వైరల్ వీడియోకు సంబంధించి బిజేపి యొక్క సోషల్ మీడియా బృంద సభ్యుడు శశి కుమార్ తో కూడా మాటాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క వైరల్ క్లిప్ అసంపూర్ణమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు ను కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసినవి. మహారాష్ట్రలో నిర్వహించబడిన ఒక ర్యాలీ నుండి పాత వీడియోతో వైరల్ క్లిప్ తయారుచేయబడింది.
చివరిగా, నకిలీ వీడియోను పోస్ట్ చేసిన యూజర్ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ను స్కాన్ చేసి, ఆ యూజర్ రేవా, మధ్యప్రదేశ్ నివాసి అని మరియు అతనికి 18000 ఫాలోయర్స్ ఉన్నారని కనుగొనింది.
ముగింపు: సమాజాన్ని విభజించాలనే ఆశయం గురించి అంగీకరించారని చేయబడిన క్లెయిమ్ అసత్యమని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వెల్లడించబడింది. వైరల్ వీడియో 2024 ప్రసంగము యొక్క ఎడిట్ చేయబడిన భాగము. నిజానికి ఈ వీడియోలో ప్రధానమంత్రి అలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీని నిందించారు.
- Claim Review : he allegedly admitted his own mission is to “divide society and seize power.”
- Claimed By : FB User Shailendra Pandey
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











