వాస్తవ తనిఖీ: మూడు సంవత్సరాల క్రితం వరంగల్లులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఒక మతపరమైన క్లెయింతో వైరల్ చేయబడింది
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ ను వాస్తవ తనిఖీ చేసింది. ఈ క్లెయిం అసత్యము అని కనుగొనబడింది. ఇది మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మరియు ఒక మతపరమైన స్పిన్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేయబడింది.
- By Vishvas News
- Updated: December 27, 2021

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): తెలంగాణలో తనకు లౌడ్స్పీకర్ నచ్చని కారణంగా ఒక గుమాస్తా ఒక పూజారిని చంపాడు అనే క్లెయింతో సోషల్ మీడియాలో ఒక నకిలీ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ పోస్ట్ వెంబడి ఈ సంఘటనకు సంబంధించి మీడియా మాట్లాడటం లేదని కూడా దావా చేయబడుతోంది. ఈ వైరల్ పోస్ట్ ను తనిఖీ చేసినప్పుడు, ఇది అసత్యమైనది అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఇది మూడు-సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మరియు ఇప్పుడు ఒక మతపరమైన దావాతో సోషల్ మీడియాలో వైరల్ చేయబడింది.
ఈ వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ యూజర్ మహంత్ శ్రీ శ్రీ భావేషానంద్ ఈ వీడియోను ఈ విధంగా క్లెయిం చేస్తూ నవంబర్ 26న అప్లోడ్ చేశారు, “ఈ వార్త ఎందుకు వైరల్ కాలేదు…? #వార్తా చానళ్ళు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయి??? *తెలంగాణాలోని ఒక #మౌల్వికి లౌడ్స్పీకర్ నచ్చని కారణంగా ఒక #పూజారిని చంపారు.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
ఈ పోస్ట్ యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయుటకు, విశ్వాస్ న్యూస్ గూగుల్ ఓపెన్ సెర్చ్ పై వార్తలలో శోధించింది. వైరల్ వీడియోలో, ఆ పూజారి పేరు సత్యనారాయణ తివారి అని మరియు నిందితుడి పేరు ఇమామ్ సాదిక్ హుస్సెయిన్ అని చెప్పబడింది. ఈ సంఘటనకు సంబంధించిన వ్యాసము మాకు న్యూస్ 18 మరియు ఆజ్ తక్ పై లభించింది. న్యూస్ 18 వారి నవంబరు 3, 2018 వ్యాసము ప్రకారము, “వరంగల్లో సాదిక్ హుస్సెయిన్ అనే ఒక వ్యక్తి సత్యనారాయణ శర్మ అనే ఒక పూజారిని తన తల్లికి ఇబ్బంది కలిగిస్తోందని, అందుచేత లౌడ్స్పీకర్ వాల్యూం తగ్గించమని అడిగారు. ఆ పూజారి నిరాకరించిన తరువాత సాదిక్ ఆయన మీద దాడి చేశారు. పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి.
ఆజ్ తక్ వారి వెబ్సైట్ పై మరొక వ్యాసాన్ని మేము కనుగొన్నాము. నవంబర్ 2, 2018 నాటి ఈ వ్యాసము ప్రకారము, “ఒక ఆంధ్రప్రదేశ్, వరంగల్ లో ఒక లౌడ్స్పీకర్ ప్లే చేసే వివాదములో ఒక ఇమాం చేసిన దాడిలో ఒక పూజారి గాయపడి మరణించారు’.
వైరల్ పోస్ట్ లో ఉపయోగించబడిన పూజారి యొక్క అదే చిత్రాన్ని ఆజ్ తక్ వార్తలలో ఉపయోగించబడింది. న్యూస్ 18 మరియు ఆజ్ తక్ యొక్క వార్తలు 2018 నాటివి అని మనము ఇక్కడ గమనించాలి. అంటే ఈ సంఘటన మూడు సంవత్సరాల క్రితం జరిగింది అని స్పష్టమౌతోంది.
దర్యాప్తును కొనసాగిస్తూ, విశ్వాస్ న్యూస్ వారు వరంగల్ యొక్క స్థానిక విలేఖరి అయిన రవి చంద్రగారితో మాట్లాడారు. వైరల్ పోస్ట్ లో క్లెయిం చేయబడిన విధంగా ఇటీవలి కాలములో ఎలాంటి సంఘటన జరగలేదు అని ఆయన చెప్పారు.
మరింత సమాచారము కొరకు, మేము వరంగల్ యొక్క స్థానిక విలేఖరి రవి చంద్రతో మాట్లాడాము. ఆయన ఇటువంటి సంఘటన ఇటీవల జరగలేదు అని చెప్పారు. ఇటువంటి సంఘటన 2018లో ఖచ్ఛితంగా జరిగింది. ఈ వైరల్ పోస్ట్ ఆ సంఘటనకు సంబంధించినదే.
ఈ పోస్ట్ ‘మహంత్ శ్రీ శ్రీ భావేశానంద్జి’ అని పేరుగల ఒక ఫేస్బుక్ యూజర్ ద్వారా షేర్ చేయబడింది. ఆయనకు 17 వేలకు పైగా అనుచరులు ఉన్నారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ ను వాస్తవ తనిఖీ చేసింది. ఈ క్లెయిం అసత్యము అని కనుగొనబడింది. ఇది మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మరియు ఒక మతపరమైన స్పిన్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేయబడింది.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ ను వాస్తవ తనిఖీ చేసింది. ఈ క్లెయిం అసత్యము అని కనుగొనబడింది. ఇది మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మరియు ఒక మతపరమైన స్పిన్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేయబడింది.
- Claim Review : తెలంగాణాలోని ఒక $మౌల్వి
- Claimed By : శ్రీ శ్రీ భావేశానంద్
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com