వాస్తవ తనిఖీ: గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడము కరోనావైరస్ నుండి రక్షిస్తుంది అని చెప్పే పోస్ట్ అసత్యము.
ముగింపు: హెల్త్ ఆర్గనైజేషన్లు మరియు నిపుణుల ప్రకారం ఉప్పు నీటితో పుక్కిలించడం కరోనావైరస్ నుండి రక్షిస్తుంది అని చెప్పే పోస్ట్ అసత్యం.
- By Vishvas News
- Updated: April 7, 2020

సామాజిక మాధ్యమములో ఉన్న ఒక వైరల్ పోస్ట్ కరోనావైరస్ ఊపిరితిత్తులను చేరుకునే ముందు అది గొంతులో నాలుగు రోజులపాటు ఉంటుంది అని చెబుతోంది. అంతేకాకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ఎక్కువ నీటిని తాగితే మరియు గోరువెచ్చని నీరు & ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే వైరస్ పోతుంది అని కూడా ఆ పోస్ట్ చెబుతోంది. విశ్వాస్ న్యూస్ దీని గురించి పరిశోధించి ఆ వైరల్ క్లెయిమ్ ను తోసిపుచ్చే నివేదికలను కనుగొనింది. ఆరోగ్య నిపుణుల ప్రకారము, గోరువెచ్చని నీటితో పుక్కిలించి గొంతుకు ఉపశమనం కలుగుతుంది కాని, అది కరోనావైరస్ కు చికిత్స కాదు.
క్లెయిమ్
అని పేరున ఫేస్బుక్ పై షేర్ చేయబడిన ఒక వైరల్ పోస్ట్ ఈ విధంగా చెబుతోంది:
“కరోనావైరస్ ఊపిరితిత్తులను చేరుకునే ముందు గొంతులో నాలుగు రోజులపాటు ఉంటుంది మరియు ఈ సమయములో ఆ వ్యక్తికి దగ్గు మరియు గొంతు నొప్పి వస్తాయి. ఆ వ్యక్తి ఎక్కువగా నీటిని తాగి గోరువెచ్చని నీరు & ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలించడము వైరస్ ను తొలగిస్తుంది. ఈ సమాచారముతో మీరు కొంతమందిని కాపాడిన వారు అవుతారు కాబట్టి ఈ సమాచారాన్ని అందరికి తెలియజేయండి”
ఈ పోస్ట్ చాలా ఆదరణ పొందింది మరియు ఈ నాటి వరకు 7.2K యూజర్ల ద్వారా షేర్ చేయబడింది. ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ను మీరు ఇక్కడ చూడవచ్చు.
పరిశోధన
విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ పై వ్యాఖ్యలను చదవడము ద్వారా తన పరిశోధనను ప్రారంభించింది. చాలామంది యూజర్లు అది అసత్యమని ఆ పోస్ట్ పై వ్యాఖ్యానించారు.

వైరల్ పోస్ట్ ప్రకారము, కరోనావైరస్ 4 రోజుల వరకు గొంతులో ఉంటుంది. మేము పరిశోధన జరిపినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వారి నివేదను చదివాము, దానిలో కోవిడ్-19 కొరకు ఇన్కుబేషన్ సమయము 1-14 రోజుల వరకు, సుమారుగా అయిదు రోజులు, ఉంటుందని అంచనా అని పేర్కొనబడింది.
మేము మరింత అన్వేషించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వారి నివేదికను కనుగొన్నాము. డబ్ల్యూహెచ్ఓ ప్రకారము ముక్కును అప్పుడప్పుడు సెలైన్ తో కడుక్కోవడం ప్రజలను కరోనావైరస్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడింది అనేందుకు ఎలాంటి రుజువులు లేవు. అయినప్పటికీ, అప్పుడపుడు ముక్కును సెలైన్ తో కడుక్కోవడం వలన సాధారణ జలుబు నుండి తొందరగా కోలుకోవచ్చు అనే దానికి కొన్ని రుజువులు ఉన్నాయి. కాని దీని అర్థం ఈ పని కరోనావైరస్ ను తగ్గిస్తుంది అని కాదు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఉప్పు మరియు వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిలించడము కరోనావైరస్ కు చికిత్స కాదు అని పేర్కొంటూ ఇలాంటి క్లెయిమ్ ను తోసిపుచ్చింది.
సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ప్రకారము, ప్రస్తుతము 2019-nCoV ఇన్ఫెక్షన్ ను నివారించుటకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు.

విశ్వాస్ న్యూస్ వారు ఆయుష్ మంత్రిత్వశాఖలోని ఫార్మాకోవిజిలెన్స్ అధికారి అయిన డా. విమల్ ఎన్. తో మాట్లాడారు. ఆయన “ఇది కరోనావైరస్ కు చికిత్స కాదు” అని చెప్తూ దీనిని తోసిపుచ్చారు.
వేడి సెలైన్ నీటితో పుక్కిలించడము సాధారణ జలుబు నుండి తొందరగా కోలుకునేందుకు సహాయపడుతుంది అనేందుకు చాలా తక్కువ రుజువులు ఉన్నాయి. కాని, ఇది కరోనావైరస్ ను తగ్గిస్తుంది అని అర్థం కాదు.”
निष्कर्ष: ముగింపు: హెల్త్ ఆర్గనైజేషన్లు మరియు నిపుణుల ప్రకారం ఉప్పు నీటితో పుక్కిలించడం కరోనావైరస్ నుండి రక్షిస్తుంది అని చెప్పే పోస్ట్ అసత్యం.
- Claim Review : గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం కరోనావైరస్ నుండి రక్షిస్తుంది.
- Claimed By : ఎఫ్బీ పేజ్
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com