వాస్తవ తనిఖీ: తెలంగాణలో చికెన్ మరియు వైన్ పంచుతున్న వీడియో కర్ణాటక ఎన్నికలకు సంబంధించినది అని వైరల్ చేయబడుతోంది
- By Vishvas News
- Updated: May 24, 2023

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): కర్ణాటక అసెంబ్లీలోని 224 సీట్ల కొరకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కోలాహలం మధ్యలో సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో షేర్ చేస్తూ, ఇది బీజేపి కార్యకర్తలకు సంబంధించినది అని, వారు కర్ణాటక ఓటర్లకు చికెన్ మరియు వైన్ పంచుతున్నారు అని క్లెయిమ్ చేయబడింది. అయితే కొంతమంది దీనిని స్వతంత్ర అభ్యర్ధికి సంబంధించినది అని చెప్తున్నారు.
విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వీడియోకు కర్ణాటక ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని కనుగొనింది. 2022లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కు చెందిన ఒక నేత రాజనాల శ్రీహరి చికెన్ మరియు వైన్ పంచారని, ఇది ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు జతచేసి షేర్ చేయబడుతోంది.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ యూజర్ అనిల్ శ్రీవాత్సవ ఏప్రిల్ 24, 2023 నాడు వైరల్ వీడియోను షేర్ చేస్తూ, క్యాప్షన్ లో ఇలా వ్రాశారు, “కర్ణాటక ఎన్నికలలో మద్యం చికెన్ పంచుతున్న భాజపా రాష్ట్రీయ అధ్యక్షుడు జేపి నడ్డా”
ఫేస్బుక్ పోస్ట్ యొక్క విషయము ఇక్కడ యథాతథంగా వ్రాయబడింది. దీని ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
మరొక ఫేస్బుక్ యూజర్ ప్రొఫెసర్ హెచ్ డి భర్తియా మే 5, 2023 నాడు వైరల్ వీడియోను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ వ్రాశారు, “కర్ణాటక ఎన్నికలలో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఎలాంటి భయం లేకుండా చికెన్-వైన్ పంచుతున్నారు”
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
వైరల్ క్లెయిమ్ గురించి వాస్తవాలు తెలుసుకొనుటకు మేము గూగుల్ పై సంబంధిత కీవర్డ్స్ ను సెర్చ్ చేయడం ప్రారంభించాము. ఈ సమయములో మాకు వీడియోకు సంబంధించి దైనిక్ జాగరణ్ వెబ్సైట్ పై అక్టోబరు 4, 2022 నాడు ప్రచురించబడిన ఒక రిపోర్ట్ లభించింది. రిపోర్ట్ ప్రకారము, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు బుధవారము జాతీయ పార్టీని ప్రకటించే ముందు వివాదాలలో ఇరుక్కున్నారు. వరంగల్లులో తెలంగాణ రాష్ట్ర సమితి నేత రాజనాల శ్రీహరి స్థానిక ప్రజలకు మద్యం సీసాలు మరియు చికెన్ పంచారు. ఈ సందర్భంగా ప్రజలకు పంచటానికి భారీ ఎత్తున మద్యం మరియు చికెన్ ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం జరిగింది.
లభించిన సమాచారము ప్రకారము మేము గూగుల్ పై సంబంధిత కీవర్డ్స్ సహాయముతో సెర్చ్ చేయడం మొదలుపెట్టాము. ఈ సమయములో మాకు అక్టోబరు 4, 2022 న షేర్ చేయబడిన వైరల్ వీడియో సమాచార ఏజెన్సీ ఏఎన్ఐ యొక్క అధికారిక ట్విట్టర్ పై లభించింది. ఇవ్వబడిన సమాచారము ప్రకారము, చంద్రశేఖర రావు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించే ముందు, పార్టీ నేత రాజనాల శ్రీహరి మద్యాన్ని పంచారు.
అదనపు సమాచారము కొరకు, మేము కర్ణాటక బీజేపి ప్రతినిధి ప్రతాప్ కుమార్ ను సంప్రదించాము. వైరల్ వీడియో క్లెయిమ్ తప్పు అని ఆయన మాకు తెలిపారు. ఈ వీడియో పాతది అని మరియు తెలంగాణాకు చెందినది. దీనికి కర్ణాటక ఎన్నికలకు మరియు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు.
దర్యాప్తు చివరిలో మేము వైరల్ వీడియోను తప్పుడు క్లెయిమ్ తో షేర్ చేసిన యూజర్ యొక్క పేజీని స్కాన్ చేశాము. యూజర్ ఒక భావజాలముచే ప్రభావితుడయ్యాడు అని మేము తెలుసుకున్నాము. యూజర్ యొక్క ఫేస్బుక్ పై 5 వేలమంది మిత్రులు ఉన్నారు.
ముగింపు: వైరల్ వీడియోకు కర్ణాటక ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. 2022 సంవత్సరములో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేత రాజనాల శ్రీహరి చికెన్ మరియు మద్యం పంచారు, దీనిని ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు సంబంధించినదిగా షెర్ చేశారు.
- Claim Review : కర్ణాటక ఎన్నికలలో మద్యం చికెన్ పంచుతున్న బీజేపి రాష్ట్రీయ అధ్యక్షుడు జేపి నడ్డా।
- Claimed By : ఫేస్బుక్ యూజర్ అనిల్ శ్రీవాత్సవ
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com