వాస్తవ తనిఖీ: ఇవి బెంగళూరు హింస ఫోటోలు కావు, ఢిల్లీ అల్లర్లకు సంబంధించినవి
కర్ణాటకలోని బెంగళూరులో హింస పేరిట వైరల్ అవుతున్న చిత్రాలు.. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించినవి.
- By Vishvas News
- Updated: August 15, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : బెంగళూరులో హింస తరువాత, ఇలాంటి అనేక ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అయితే, వీటికి బెంగళూరుతో ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి రెండు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇందులో జనం కాల్పులు, హింసకు పాల్పడుతున్న దృశ్యాలు చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, ఈ వాదన గందరగోళంగా మరియు తప్పుదోవ పట్టించేదిగా ఉంది. ఢిల్లీ అల్లర్లతో ముడిపడి ఉన్న చిత్రాలను బెంగళూరులో జరిగిన హింస అంటూ వైరల్ చేస్తున్నారు.
వైరల్ పోస్టులో ఏం ఉంది ?
‘జన్నేట్ కాశ్మీర్’ అనే ఫేస్బుక్ యూజర్ ఈ వైరల్ ఫోటోలను షేర్ చేశారు. “బెంగళూరులో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. బిజెపి ఎమ్మెల్యే కుమారుడు ప్రవక్త మహమ్మద్ (సా)ను అవమానించాడు. 60 మంది పోలీసులు గాయపడ్డారు ఇద్దరు సామాన్యులు హత్యకు గురయ్యారు. 144 సెక్షన్ విధించారు.”
దీనికి సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

బెంగళూరులో హింసను పరిగణనలోకి తీసుకుని చాలా మంది ఫేస్బుక్ యూజర్లు ఈ ఫోటోలను షేర్ చేసుకున్నారు.
దర్యాప్తు :
సోషల్ మీడియా పోస్టులపై బెంగళూరులో జరిగిన హింసాకాండలో ఇప్పటివరకు 145 మందిని అరెస్టు చేసినట్లు దైనిక్ జాగరన్లో ప్రచురించిన వార్తాకథనం తెలిపింది. సోషల్ మీడియా పోస్టుల్లో చోటుచేసుకున్న హింసలో 60 మంది పోలీసులు కూడా గాయపడ్డారు.

వైరల్ ఫోటోలతో పాటు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుమారుడు రెచ్చగొట్టేలా పోస్ట్ చేశాడని, ఇది హింసకు దారితీసిందని పేర్కొన్నారు. ఆజ్ తక్ వెబ్సైట్లో వచ్చిన వార్తాకథనం ప్రకారం, ‘బావాల్ అనే వ్యక్తి చేసిన ఫేస్బుక్ పోస్ట్తో ఇది ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు శ్రీనివాస్ మూర్తి ఫేస్బుక్లో రెచ్చగొట్టే పోస్ట్ను పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పోస్ట్ తరువాత, మంగళవారం రాత్రి 9.30 గంటలకు, తూర్పు బెంగళూరులోని ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇంటిపైనా మరియు పాతబెంగళూరులోని డిజె హల్లి పోలీస్ స్టేషన్ పై దుండగులగుంపు దాడి చేసింది.

వైరల్ పోస్ట్లోని రెండు చిత్రాలు బెంగళూరు హింసకు లింక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకే మేము ఈ రెండు చిత్రాలను సునిశితంగా పరిశీలించడం జరిగింది.
మొదటి ఫోటో :

గూగుల్ రివర్స్-ఇమేజ్లో శోధించినప్పుడు మేము ఈ ఫోటోను చాలా వార్తా వెబ్సైట్లలో కనుగొన్నాము. 2020 ఫిబ్రవరి 26 న న్యూస్ 18.కామ్ వెబ్సైట్లో ప్రచురించిన ఫోటో గ్యాలరీలో కూడా ఈ ఫోటో కనిపించింది.

పైన ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫోటో న్యూఢిల్లీలోని జాఫరాబాద్లో హింసాత్మక నిరసన చెలరేగినప్పుడు తీసినది. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారాయి, ఆ అల్లర్లలో 50 మందికి పైగా మరణించారు.
రెండవ ఫోటో :

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్లో ఈ రెండో ఫోటోను శోధించగా.. ముంబై మిర్రర్.కామ్ వెబ్సైట్లో ప్రచురించిన ఒక న్యూస్రిపోర్ట్లో ఈ ఫోటోను మేము కనుడం జరిగింది. 2020 మార్చి 1 న ప్రచురించిన వార్తాకథనం ప్రకారం, ఈ చిత్రం న్యూఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించినది.
ఆ కథనంలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫోటో న్యూఢిల్లీలోని మౌజ్పూర్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు సంబంధించినది. తూర్పు ఢల్లీని కవర్ చేస్తున్న మా సహోద్యోగి దైనిక్ జాగరన్ సీనియర్ రిపోర్టర్ షుజావుద్దీన్, ఈ చిత్రాలు ఢిల్లీ అల్లర్లతో ముడిపడి ఉన్నాయని ధృవీకరించారు, “ఈ రెండు ఫోటోలు ఈ ఏడాది ఫిబ్రవరిలో డిల్లీ అల్లర్లకు సంబంధించినవి” అని చెప్పారు.
తప్పుడు వాదనలతో ఈ వైరల్ ఫోటోను షేర్ చేసుకున్న పేజీని 12 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఈ పేజీ 2018 ఆగస్టు నుండి ఫేస్బుక్లో చురుకుగా ఉంది.
निष्कर्ष: కర్ణాటకలోని బెంగళూరులో హింస పేరిట వైరల్ అవుతున్న చిత్రాలు.. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించినవి.
- Claim Review : బెంగళూరు హింస ఫోటోలు
- Claimed By : ఫేస్బుక్ యూజర్ - జన్నేట్ కాశ్మీర్
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com