వాస్తవ తనిఖీ: ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించిన ఒక పాత చిత్రం బెంగళూరులోని భారీ వర్షాలకు తప్పుగా లింక్ చేయబడింది.
విశ్వాస్ న్యూస్ వారు జరిపిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని తేలింది. ఈ వైరల్ చిత్రానికి బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్రము 2021లో ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించినది.
- By Vishvas News
- Updated: May 25, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). బెంగళూరులోని భారీ వర్షము తరువాత దృశ్యము అని పేర్కొంటూ ఒక చిత్రము సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. చాలా కార్లు నీటిలో సగం ముగినిపోయినట్లు ఆ చిత్రములో చూడవచ్చు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనబడింది. ఈ వైరల్ చిత్రానికి బెంగళూరులోని ఇటీవలి వర్షాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫోటో అక్టోబరు 2021 లో సంభవించిన ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించినది.
ఈ వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ యూజర్ నాగరాజు డాన్ బిఎన్ఆర్ ఈ వైరల్ చిత్రాన్ని షేర్ చేసి ఇలా వ్రాశారు, “డబల్ ఇంజన్ ప్రభుత్వము బెంగళూరులో కారు ఈతల పోటీలు నిర్వహించింది. గమనిక: ఏ ప్రభుత్వము ప్రకృతి వైపరీత్యాలను ఆపలేదు.. వాటి తరువాత మీరు తీసుకునే చర్యలే ముఖ్యం.. హైదరాబాదులో వర్షాలు కురిసినప్పుడు కుక్క సంతోషాన్ని పొందే వారి కొరకు..#బెంగళూరువర్షాలు”
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
వైరల్ చిత్రము గురించిన వాస్తవాలను తెలుసుకోవటానికి, విశ్వాస్ న్యూస్ వారు ఈ చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ పై సెర్చ్ చేశారు. ఈ వైరల్ చిత్రము పై ఒక రిపోర్ట్ మాకు www.financialexpress.com పై లభించింది. చిత్రము వెంట ఉన్న ఒక వివరణ ఇలా ఉంది, “ఉత్తరాఖండ్ లో జిం కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద కోసి నది ఉప్పొంగడము వలన వరదలు ముంచెత్తిన ఒక హోటర్ రిసార్ట్ వద్ద మునిగిపోయి ఉన్న కార్లను చూడవచ్చు. (ఏపి/పిటిఐ ఫోటో)”
అలాగే మాకు ఈ చిత్రము english.alarabiya.net పై ఒక వార్తా వ్యాసములో కూడా లభించింది. ఈ చిత్రము వెంట ఉన్న వివరణ ఇలా ఉంది “ఉత్తరాఖండ్, ఇండియాలో మంగళవారం, అక్టోబరు 19, 2021 రోజున జిం కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద కోసి నది ఉప్పొంగడము వలన వరదలు ముంచెత్తిన ఒక హోటర్ రిసార్ట్ వద్ద మునిగిపోయి ఉన్న కార్లను చూడవచ్చు. ఉత్తర భారతములోని ఉత్తరాఖండ్ రాష్ట్రములో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలలో 20 మందికి పైగా చనిపోయారు మరియు వరదలలో చాలామంది గల్లంతు అయ్యారు అని మంగళవారం నాడు అధికారులు వెల్లడించారు (ఏపి ఫొటో/ముస్తఫా ఖురేషి!)”.
దర్యాప్తును మరింత ముందుకు కొనసాగిస్తూ, మేము ఉత్తరాఖండ్ దైనిక్ జాగరణ్, డిజిటల్ హెడ్, సునీల్ నేగి గారిని సంప్రదించాము. ఇది ఉత్తరాఖండ్ కు చెందిన చిత్రమే అని ఆయన ధృవీకరించారు. ఆయన ఈ వరదల గురించి Jagran.com లోని ఒక వార్తా నివేదికను కూడా షేర్ చేశారు, ఇందులో ఈ దృశ్యాన్ని వేరొక కోణములో చూడవచ్చు.
దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ, మేము ఈ చిత్రాన్ని తీసిన ఫోటోజర్నలిస్ట్ అయిన ముస్తఫా ఖురేషి గారిని కూడా సంప్రదించాము. ఇప్పుడు ఆయన ఏపికి సంబంధించినవారు కారు. ఆయన ఇలా అన్నారు, “నేను ఈ చిత్రాన్ని 2021లో తీశాను. ఇది ఉత్తరాఖండ్ యొక్క చిత్రము”.
విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తు యొక్క చివరి దశలో, ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన ప్రొఫైల్ యొక్క నేపథ్యాన్ని తనిఖీ చేసింది. యూజర్ నాగరాజు డాన్ బిఎన్ఆర్ కు 1577 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని మేము తెలుసుకున్నాము.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ వారు జరిపిన దర్యాప్తులో ఈ వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని తేలింది. ఈ వైరల్ చిత్రానికి బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్రము 2021లో ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించినది.
- Claim Review : డబల్ ఇంజన్ ప్రభుత్వము బెంగళూరులో కారు ఈతల పోటీలు నిర్వహించింది. గమనిక: ఏ ప్రభుత్వము ప్రకృతి వైపరీత్యాలను ఆపలేదు.. వాటి తరువాత మీరు తీసుకునే చర్యలే ముఖ్యం.. హైదరాబాదులో వర్షాలు కురిసినప్పుడు కుక్క సంతోషాన్ని పొందే వారి కొరకు.
- Claimed By : బాలు అన్న యువసేన
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com