ఫాక్ట్ చెక్: ఆంధ్ర ప్రదేశ్లో జరిగిన ఎలుగుబంటి దాడి ఫోటోలని జార్ఖండ్లో పులి దాడిగా షేర్ చేశారు
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ వాదన తప్పు అని తేలింది. ఈ ఫోటోలకు జార్ఖండ్తో ఎలాంటి సంబంధం లేదు, వైరల్ ఫోటోలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలుగుబంటి దాడికి సంబంధించినవి.
- By Vishvas News
- Updated: July 21, 2022

న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్). కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇక్కడ తీవ్రంగా గాయపడిన కొంతమంది వ్యక్తులను చూడవచ్చు. కొన్ని పులుల ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవి జార్ఖండ్లో జరిగిన పులి దాడికి సంబంధించిన ఫోటోలు అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ వాదన తప్పు అని తేలింది. ఈ ఫోటోలకు జార్ఖండ్కి ఎలాంటి సంబంధం లేదు, వైరల్ ఫోటోలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలుగుబంటి దాడికి సంబంధించినవి.
వైరల్ పోస్ట్లో లో ఏమని ఉంది?
‘పలోజోరి బ్లాక్లోని దుబ్రాజ్పూర్ గ్రామంలో టైగర్ ఎటాక్’ అంటూ రిపోర్టర్ బబ్లూ రాజ్ అనే ఫేస్బుక్ యూజర్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ ఆర్కైవ్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
వైరల్ ఫోటోలలోని నిజానిజాలను తెలుసుకోవడానికి విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా ఈ ఫోటోలను సెర్చ్ చేసింది. andhrajyothy.com లోని ఒక ఆర్టికల్లో వైరల్ ఫోటోలను చూశాము. వార్త ప్రకారం “వజ్రపుకొత్తూరు, జూన్ 20: వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. కిడిసింగి గ్రామానికి చెందిన కడ్మటి కోదండరావు (72) ఆదివారం ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. వజ్రపుకొత్తూరులోని జీడిమామిడి తోటలో పని చేస్తున్న రైతులపై ఎలుగుబంటి సోమవారం దాడి చేసి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచింది. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్కు చెందినదని, ఈ దాడి చేసింది పులి కాదని, ఎలుగుబంటి చేసిందని ఆ వార్తాకథనంలో పేర్కొన్నారు.
ఈ సంఘటన గురించి మేము కొన్ని ఇతర వెబ్ సైట్ లలో కూడా వార్తలను చూశాము.
జార్ఖండ్లో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగిందా అని కీలక పదాల సహాయంతో మేము వెతికాము. కాని మాకు అలాంటి సమాచారం ఎక్కడా కనిపించలేదు.
దీని గురించి మేము దైనిక్ జాగరణ్ యొక్క రాంచీ కరస్పాండెంట్ ఆశిష్ ఝాతో మాట్లాడాము. ఈ సంఘటన జార్ఖండ్కు చెందినది కాదని ఆయన ధృవీకరించారు. వాస్తవానికి జార్ఖండ్లో ఇటీవల అటువంటి దాడి ఏదీ రిపోర్ట్ చేయబడలేదు.
విశ్వాస్ న్యూస్, దర్యాప్తు చివరి దశగా, వైరల్ పోస్ట్ను షేర్ చేసిన ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ చెక్ నిర్వహించింది. యూజర్ ‘రిపోర్టర్ బబ్లూ రాజ్’ జార్ఖండ్ నివాసి అని మేము తెలుసుకున్నాము.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ వాదన తప్పు అని తేలింది. ఈ ఫోటోలకు జార్ఖండ్తో ఎలాంటి సంబంధం లేదు, వైరల్ ఫోటోలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలుగుబంటి దాడికి సంబంధించినవి.
- Claim Review : పలోజోరి బ్లాక్లోని దుబ్రాజ్పూర్ గ్రామంలో టైగర్ ఎటాక్
- Claimed By : రిపోర్టర్ బబ్లూ రాజ్
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com