వాస్తవ తనిఖీ: తెలంగాణలో జరిగిన ఉప-ఎన్నికల వీడియోను కర్ణాటకలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ చేయబడుతోంది
- By Vishvas News
- Updated: May 15, 2023

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ప్రచారాల నేపథ్యములో సోషల్ మీడియా యూజర్లు ఒక వీడియోను షేర్ చేస్తున్నారు, ఇందులో ఒక మహిళ ఒక కవర్ నుండి నోట్లు తీయడం చూడవచ్చు. ఈ వీడియో కర్ణాటకకు చెందినది అని, ఓట్ల కొనుగోలు కోసం ఓటర్లకు డబ్బులు పంచబడుతున్నాయని క్లెయిమ్ చేయబడుతోంది.
ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తేలింది. వైరల్ చేయబడుతున్న వీడియో తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నికలకు సంబంధించినది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినదిగా క్లెయిమ్ చేస్తూ ఈ పాత వీడియో వైరల్ చేయబడింది.
ఏది వైరల్ అయ్యింది?
సోషల్ మీడియా యూజర్ ‘గాయత్రి కచ్ఛవ’ వైరల్ వీడియోను (ఆర్కైవ్ లింక్) షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “నోటుకు బదులు ఓటు..కర్ణాటక!”
చాలామంది ఇతర యూజర్లు కూడా ఈ వీడియోను కర్ణాటకకు చెందినదిగా తెలుపుతూ ఇటువంటి క్లెయిమ్స్ తో షేర్ చేశారు.
దర్యాప్తు
వైరల్ వీడియోలో ఒక మహిళ ఒక కవర్ నుండి 2000 రూపాయల నోటును తీస్తూ ఉండటం చూడవచ్చు. కవర్ మీద భారతీయ జనతా పార్టీ (బీజేపి) యొక్క ఎన్నికల చిహ్నము కనిపిస్తోంది. న్యూస్ సెర్చ్ లో కర్ణాటకలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది అని తెలిపే నివేదిక ఏది మాకు లభించలేదు. వైరల్ వీడియో యొక్క అసలుల్ మూలము గురించి తెలుసుకొనుటకు మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయం తీసుకున్నాము.
సెర్చ్ లో మాకు ఎన్టీవీ తెలుగు యొక్క అధికారిక యూటూబ్ ఛానల్ లో ఒక ఏడాది క్రితం అప్లోడ్ చేయబడిన ఒక వీడియో బులెటిన్ లభించింది.
ఇందులో కనిపించే వీడియో వైరల్ వీడియో యొక్క సుదీర్ఘ వర్షన్. వీడియో వెంబడి ఇవ్వబడిన సమాచారము ఆధారంగా, ఇది తెలంగాణలోని హుజూరాబాద్ లో జరిగిన సంఘటన.
మరొక ట్విట్టర్ యూజర్ ‘మాణిక్యం ఠాగూర్’ .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப’ ఈ వీడియోను తెలంగాణాలోని హుజూరాబాద్ కు చెందినది అని తెలుపుతూ, తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పై అక్టోబరు 28, 2021 నాడు షేర్ చేశారు.
అనేక ఇతర రిపోర్ట్స్లో కూడా హుజూరాబాద్ ఉపఎన్నికలలో డబ్బులు పంచబడ్డాయి అని ప్రస్తావించబడింది. అక్టోబరు 30, 2021 నాటి ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క రిపోర్ట్ ప్రకారము, రణదీప్ సింగ్ సుర్ఝేవాలా నాయకత్వములో కాంగ్రెస్ ప్రతినిధి బృందము హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలను రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్ధించింది. ఎన్నికలలో ఒటు కోసం నోటు పంచబడుతోంది అని బీజేపి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి రెండు పార్టీలపై కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు వైరల్ వీడియోకు ఎలామ్టి సంబంధం లేదని మా దర్యాప్తులో స్పష్టం అయ్యింది. ఎన్నికల సంఘం మార్చ్ 29, 2023 నాడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కొరకు తేదీ ప్రకటించింది. కర్ణాటకలో మే 10 న ఎన్నికలు జరుగుతాయి మరియు మే 13 వీటి ఫలితాలు ప్రకటించబడతాయి.
వైరల్ వీడియోకు సంబంధించి మేము హైదరాబాదులో ఉన్న స్థానిక టీవి విలేఖరి నూర్ మొహమ్మద్ ను సంప్రదించాము. ఇది హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయములో వైరల్ అయిన అనేక వీడియోలలో ఒకటి అని ఆయన స్పష్టం చేశారు.
దీనికి ముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బిబిసి పేరున ప్రీ-పోల్ డేటా వైరల్ అయింది, ఇది నకిలీది అని మా దర్యాప్తులో తేలింది. మా వాస్తవ తనిఖీ నివేదికను మీరు ఇక్కడ చదవవచ్చు.
తప్పు క్లెయిమ్ తో వైరల్ వీడియోను షేర్ చేసిన యూజర్ కు ఫేస్బుక్ లో సుమారు మూడు వందలమంది ఫాలోయర్స్ ఉన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రకటన జరిగిన తరువాత, ఏప్రిల్ నెల రాజకీయ కార్యకలాపాలు జరిగాయి, మరియు ఇదే నేపథ్యములో వాస్తవ తనిఖీ ధోరణులలో కనిపించింది. ఏప్రిల్ నెలలో విశ్వాస్ న్యూస్ సుమారు 150 వాస్తవ తనిఖీ నివేదికలు ప్రచురించబడ్డాయి మరియు ఈ నివేదికలలో రాజకీయ విషయాలకు సంబంధించి వాస్తవ తనిఖీలు ఎక్కువగా జరిగాయి. ఏప్రిల్ నెలలో భారతీయ సోషల్ మీడియా పై మిస్-ఇన్ఫర్మేషన్ యొక్క ధోరణులు అర్థం చేసుకొనుటకు విశ్వాస్ న్యూస్ యొక్క ఈ విశేష నివేదికలు చదవవచ్చు.
ముగింపు: తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యములో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు క్లెయిమ్ తో వైరల్ అయిన ఒక వీడియో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి వైరల్ చేయబడింది.
- Claim Review : కర్ణాటకలో ఓటు కోసం నోటు పంచబడుతోంది
- Claimed By : ఎఫ్బి యూజర్- గాయత్రి కచ్ఛవ
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com