వాస్తవ తనిఖీ: తన సంస్థ నిర్వహిస్తున్న COVID-19 క్లినికల్ ట్రయల్స్లో ఆ సంస్థ వైఎస్ ప్రెసిడెండ్ పాల్గొనలేదు, వైరల్ దావా తప్పు
ముగింపు : ఈ వైరల్ పోస్ట్ అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో క్లిక్ చేసినప్పుడు డాక్టర్ వి.కె.శ్రీనివాస్ తన రక్త నమూనాను సాధారణ ప్రక్రియలో భాగంగా ఇస్తున్నాడు. ఆయన COVID-19 క్లినికల్ ట్రయల్లో పాల్గొనలేదు.
- By Vishvas News
- Updated: July 9, 2020

ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ప్రధానంగా వాట్సాప్ లో ఎక్కువగా తిరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్లో పాల్గొంటున్న ఓ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వికె శ్రీనివాస్ మరొక మెడికల్ ప్రొఫెషనల్ తో పాటు ఆ ఫోటోలో చూడవచ్చు. కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్లో పాల్గొనడానికి డాక్టర్ వి.కె.శ్రీనివాస్ స్వయంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆ పోస్ట్ పేర్కొంది.
ఈ వైరల్ పోస్ట్ అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో క్లిక్ చేసినప్పుడు డాక్టర్ వి.కె.శ్రీనివాస్ తన రక్త నమూనాను సాధారణ ప్రక్రియలో భాగంగా ఇస్తున్నాడు. ఆయన COVID19 క్లినికల్ ట్రయల్ లో పాల్గొనలేదు.
వైరల్ అవుతున్నది ఏమిటి ?

ఈ పోస్ట్ యొక్క వివరణ ‘భారత్ బయోటెక్ వైస్ ప్రెసిడెంట్ డా. వి.కె.శ్రీనివాస్, కోవిడ్ 19 వ్యాక్సిన్కు సంబంధించిన మొదటి ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. వారి ఉత్పత్తిపై వారికి నమ్మకం ఉంది’
ఈ పోస్ట్ను The At News అనే ఫేస్బుక్ పేజీ షేర్ చేసింది.
ఈ ఫేస్బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
ఈ పోస్ట్ నిజమైనదా అని తెలుసుకోవడానికి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి ఈ ఫోటోను శోధించాము. కానీ గుర్తించదగినదేదీ కనుగొనలేకపోయాము.
అప్పుడు మేము ఈ వార్తల గురించి గూగుల్లోని కీలకపదాలతో శోధించాలని నిర్ణయించుకున్నాము. ఈ శోధనల హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ కోవిడ్ -19 వ్యాక్సిన్పై పరిశోధన చేస్తున్నట్లు మేము కనుగొన్నాము.
క్లినికల్ ట్రయల్స్పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఒక ప్రకటనను కూడా మేము కనుగొన్నాము. ఇది సంస్థ చేపట్టిన అనేక పరిశోధనలను వివరిస్తుంది. టీకా పరిశోధన పురోగతిని కూడా వారు వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-పూణే, ఐసిఎంఆర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ అధ్యయనాలు నిర్వహిస్తున్నాయి. అన్ని పరీక్షలు పూర్తయిన తరువాత, ఆగస్టు 15 లోగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కూడా భావిస్తున్నారు. అంతేకాదు, వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనే వాలంటీర్లు జూలై 7 లోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. జూలై 2 న ఈ ప్రకటన చేశారు.

వైరల్ అవుతున్న ఈ సమాచారంపై వాస్తవ తనిఖీకోసం మేము ఇ-మెయిల్లో భారత్ బయోటెక్ను సంప్రదించాము, దానికి ఈ ట్వీట్ను నకిలీ వార్తలపై వారి అధికారిక ప్రకటనగా పరిగణించాలని వారు సమాధానం ఇచ్చారు.
వాస్తవాన్ని తనిఖీ చేయడానికి, మేము భారత్ బయోటెక్ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాను శోధించాము. వైరల్ దావాపై స్పష్టతతో మేము ఒక ట్వీట్ను కనుగొన్నాము. ఈ దావా తప్పు అని ట్వీట్ ధృవీకరించింది. క్లినికల్ ట్రయల్ కోసం కాకుండా, డాక్టర్ వి.కె.శ్రీనివాస్ ఒక సాధారణ ప్రక్రియ కోసం రక్త నమూనా ఇస్తున్నప్పుడు ఈ ఫోటో తీయబడిందని ట్వీట్లో పేర్కొన్నారు.
వైరల్ అవుతున్న ఈ పోస్ట్ను ‘The At News’ అనే ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. ఈ పేజీకి ఫేస్బుక్లో 7,115 మంది ఫాలోవర్లు ఉన్నారు.
निष्कर्ष: ముగింపు : ఈ వైరల్ పోస్ట్ అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో క్లిక్ చేసినప్పుడు డాక్టర్ వి.కె.శ్రీనివాస్ తన రక్త నమూనాను సాధారణ ప్రక్రియలో భాగంగా ఇస్తున్నాడు. ఆయన COVID-19 క్లినికల్ ట్రయల్లో పాల్గొనలేదు.
- Claim Review : 'భారత్ బయోటెక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వికె శ్రీనివాస్.. కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి ఇంజెక్షన్ను తీసుకున్నారు. తమ పరిశోధనలపై ఆయనకు అంత నమ్మకం ఉంది'
- Claimed By : ఫేస్బుక్ పేజీ The At News
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com