వాస్తవ తనిఖీ: కరోనా వైరస్ కారణంగా సెప్టెంబర్ 30 వరకు ఇండియన్ రైల్వే అన్నిరైళ్లనూ రద్దు చేయలేదు. వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీ.
సెప్టెంబర్ 30వ తేదీ వరకు అన్ని రైళ్లు రద్దయ్యాయని జరుగుతున్న వాదన తప్పు అని నిరూపించబడింది. భారత రైల్వే స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఈ వాదనను ఖండించింది.
- By Vishvas News
- Updated: August 16, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సెప్టెంబర్ 30 వరకు భారత రైల్వే అన్ని ఎక్స్ప్రెస్ మరియు ఇతర రైళ్లను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు ఈ వాదన అబద్ధమని కనుగొనడం జరిగింది. ఇలాంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయలేదని భారత రైల్వే స్పష్టం చేసింది.
దావా :
సెప్టెంబర్ 30 వరకు భారత రైల్వే అన్ని రైళ్లను రద్దు చేసిందని ట్విట్టర్లో షేర్ చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. ‘ది రిపోర్ట్స్ టుడే’ అనే ట్విట్టర్ యూజర్ ఆగస్టు 10వ తేదీన ఈట్వీట్ చేశారు. : ‘కరోనా మహమ్మారి కారణంగా అన్ని ప్రయాణీకుల / ఎక్స్ప్రెస్ / ఇతర రైళ్లు సెప్టెంబర్ 30 వరకు రద్దు చేయబడ్డాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అన్ని ప్రయాణీకుల / ఎక్స్ప్రెస్ / సబర్బన్ రైళ్ల రద్దును సెప్టెంబర్ 30 వరకు రైల్వే పొడిగించింది.’
ఈ ట్వీట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్లో ఉన్న కీ వర్డ్స్ను ఉపయోగించి గూగుల్లో ఈ దావా గురించి శోధించడం ద్వారా తన పరిశోధనను ప్రారంభించింది. (సెప్టెంబర్ 30, ఇండియన్ రైల్వే). మేము దైనిక్ జాగరణ్ వెబ్సైట్లో ఒక వార్తా కథనాన్ని కనుగొన్నాము. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రైళ్లు రద్దు చేసిన వార్తలను నకిలీవిగా భారత రైల్వే స్పష్టం చేసింది.. అని న్యూస్ పీస్లో స్పష్టంగా పేర్కొన్నారు.
దైనిక్ జాగరణ్ యొక్క ఈ కథనం సారాంశాన్ని ఇక్కడ క్లిక్ చేసి ఇంకా వివరంగా చదవవచ్చు.

మేము దీనిపై మరింత దర్యాప్తు చేయడం జరిగింది. ఆ క్రమంలో భారత రైల్వే యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ను కనుగొన్నాము. ఈ ట్వీట్లో, ఇండియన్ రైల్వే స్పష్టంగా పేర్కొంది. ఆ పోస్ట్ను పరిశీలిస్తే.. : ”సెప్టెంబర్ 30 వరకు అన్ని సాధారణ రైళ్లను రైల్వే రద్దు చేసినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇది నిజం కాదు. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త సర్క్యులర్ ఏదీ జారీ చేయలేదు. స్పెషల్, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు యథావిధిగా నడుస్తూనే ఉంటాయి.”
ఈ ప్రచారానికి సంబంధించి రైల్వే ప్యాసింజర్ ఫెసిలిటేషన్ కమిటీ సభ్యుడైన అరుణేష్ మిశ్రాతో విశ్వాస్ న్యూస్ మాట్లాడటం జరిగింది. సెప్టెంబర్ 30 లోగా అన్ని రైళ్లను రద్దు చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. స్పెషల్ ట్రైన్స్ యథావిధిగా నడుస్తూనే ఉంటాయని, మిగిలిన రైళ్లు మునుపటి లాగే నిలిపివేస్తామని అరుణేష్ మిశ్రా తెలిపారు.
అన్ని ప్రత్యేక రైళ్లు మునుపటిలాగే కొనసాగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఆగస్టు 11వ తేదీన ఒక ప్రకటన ఇచ్చింది. వీటితో పాటు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు మునుపటిలాగే నిలిపివేయబడతాయని ఆ ప్రకటనలో రైల్వే స్పష్టం చేసింది. ప్రత్యేక రైళ్లను కూడా అవసరానికి అనుగుణంగా పొడిగించవచ్చునని పేర్కొంది.
నకిలీ పోస్ట్ను ట్వీట్ చేసిన యూజర్ ‘The Reports Today’ యొక్క ట్టిట్టర్ ప్రొఫైల్ను మేము సునిశితంగా పరిశీలించడం జరిగింది. ఈ ట్విట్టర్ ప్రొఫైల్ ఆగస్టు 2017లో క్రియేట్ చేశారు. ఈ పోస్టుపై విశ్వాస్న్యూస్ వాస్తవ తనిఖీ చేసే వరకు దీనికి 2,561 మంది ఫాలోవర్లు ఉన్నారు.

निष्कर्ष: సెప్టెంబర్ 30వ తేదీ వరకు అన్ని రైళ్లు రద్దయ్యాయని జరుగుతున్న వాదన తప్పు అని నిరూపించబడింది. భారత రైల్వే స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఈ వాదనను ఖండించింది.
- Claim Review : కరోనావైరస్ కారణంగా భారత రైల్వే సెప్టెంబర్ 30 వరకు అన్ని సాధారణ రైళ్లను రద్దు చేసింది.
- Claimed By : 'ద రిపోర్ట్స్ టుడే'
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com