వాస్తవ తనిఖీ: ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్ చనిపోతుందనే వాదన అబద్ధం
ఆవిరి చికిత్స నుండి కరోనా వైరస్ను చంపవచ్చని సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్ట్ అబద్ధం. ఆవిరి చికిత్సను కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి WHO గానీ, CDSగానీ ఒక చికిత్సగా పరిగణించలేదు.
- By Vishvas News
- Updated: September 7, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్ను నిర్మూలించవచ్చని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ఫేస్బుక్లోనే కాదు.. వాట్సాప్లో కూడా చక్కర్లు కొడుతోంది. వాస్తవమేంటో తనిఖీ చేసేందుకు విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్బాట్లో ఈ పోస్ట్ను అందుకుంది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఈ వాదన అబద్ధమని తేల్చింది.
దావా :
ఓ ఫేస్బుక్ వినియోగదారుడు ఆగస్టు 9వ తేదీన ఇలా ఒక పోస్ట్ షేర్ చేశారు: ‘ప్రపంచ ఆవిరి వారం, వైద్యులు చెబుతున్న దాని ప్రకారం, ముక్కు నుండి ఆవిరితో కొట్టినట్లయితే, కరోనాను నిర్మూలించవచ్చు. ప్రతి ఒక్కరూ ఆవిరి గురించి ప్రచారం చేయాలి. ఇది పనిచేయడానికి, ఆగస్టు 07 నుండి ఆగస్టు 14 వరకు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం ఒక వారం రోజుల పాటు ఆవిరి ప్రక్రియను ప్రారంభించాలని ప్రపంచం నలుమూలల ఉన్న ప్రజలను మేము కోరుతున్నాము. ఆవిరి పట్టడానికి కేవలం 5 నిమిషాలు చాలు. ఒక వారం రోజుల పాటు ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా, ఘోరమైన కరోనా వైరస్ నిర్మూలించబడుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము, దయచేసి ఈ పోస్ట్ను మా గ్రూపులు, బంధువులు, స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వాళ్లందరికీ సెండ్ చేయండి. తద్వారా మనమందరం కలిసి ఈ కరోనా వైరస్ను చంపగలుగుతాము. ధన్యవాదాలు, ప్రతి గ్రూపుకు పంపమని మీరు కూడా అభ్యర్థించండి.’
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ వాట్సప్ ఫ్యాక్ట్ చెకింగ్ చాట్బాట్లో ఇలాంటి మెస్సేజ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ దీనికి సంబంధించిన కీవర్డ్స్ను ఉపయోగించి గూగుల్లో శోధించింది. (ఆవిరి కరోనా వైరస్ను చంపుతుంది). రాయిటర్స్ వెబ్సైట్లో మేము ఒక నివేదికను కనుగొన్నాము. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆవిరి చికిత్సను కరోనావైరస్ చికిత్సగా పరిగణించలేదని ఈ నివేదిక స్పష్టంగా పేర్కొంది.
రాయిటర్స్ రిపోర్ట్ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన వెబ్సైట్లో పేర్కొంటుంది.
వైరల్ దావాకు సంబంధించి రామ్ సాగర్ మిశ్రా కంబైన్డ్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ సుమిత్తో విశ్వాస్ న్యూస్ ప్రతినిధి మాట్లాడారు. ‘అలాంటి మెస్సేజ్లను నమ్మవద్దు. అవి తప్పుడు ఉద్దేశ్యంతో వైరల్ అవుతున్నాయి. ఆవిరి చికిత్సతో కరోనా వైరస్ను నిర్మూలించడం సాధ్యం కాదు.’ అని డాక్టర్ సుమిత్ చెప్పారు.

ఈ వైరల్ పోస్ట్ను ‘భైరారామ్ సియోల్ ఫ్యాన్ అస్సీస్’ అనే ఫేస్బుక్పేజీలో షేర్ చేశారు. మేము పేజీ యొక్క ప్రొఫైల్ను స్కాన్ చేయడం జరిగింది. ఈ పేజీకి ఇప్పటి వరకు 33వేల 290 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
DISCLAIMER: #కరోనావైరస్ఫ్యాక్ట్స్ డేటాబేస్ కోవిడ్-19 వ్యాప్తి ప్రారంభం నుండి ప్రచురించబడిన వాస్తవాలు-తనిఖీలను నమోదు చేస్తుంది. మహమ్మారి మరియు దాని పర్యవసానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా రోజులు, వారాలు గడిచే సరికి ఖచ్చితమైన డేటా మారవచ్చు. కాబట్టి దీనిని ఎవరికైనా షేర్ చేయడానికి ముందు మీరు చదువుతున్న ఫాక్ట్-చెక్ స్టోరీ ప్రచురించబడిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుంచుకోండి.
निष्कर्ष: ఆవిరి చికిత్స నుండి కరోనా వైరస్ను చంపవచ్చని సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్ట్ అబద్ధం. ఆవిరి చికిత్సను కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి WHO గానీ, CDSగానీ ఒక చికిత్సగా పరిగణించలేదు.
- Claim Review : ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్ను చంపవచ్చు
- Claimed By : భైరారామ్ సియోల్ ఫ్యాన్ అస్సీస్
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com