వాస్తవ తనిఖీ: ఎడిటింగ్ టూల్స్తో రూపొందించిన ఫోటో నకిలీ దావాలతో వైరల్
‘ఈ ఫోటో ఈ యాంగిల్లో తీయడానికి ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించాడు, మరియు 62 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. దీనిని ఇలా మళ్లీ 2035లో మాత్రమే చూడవచ్చు’
- By Vishvas News
- Updated: December 31, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : పొడవైన సమాంతర చెట్ల మధ్య పైభాగంలో చంద్రుడు మరియు దిగువన సూర్యుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోను తీయడానికి ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించారని ఈ పోస్ట్లో పేర్కొన్నారు. అలాగే, ఈ ఫోటో తీయడానికి 62 రోజులు పట్టిందని ఆ పోస్ట్ ఆరోపించింది.
ఈ వాదన నకిలీదని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తేలింది. సమాంతర చెట్ల మధ్య సూర్యుడు మరియు చంద్రుడి ఫోటోలను ఎడిటింగ్ ద్వారా అతికించిన ఈ ఫోటో తప్పుడు వాదనలతో వైరల్ అవుతుంది.
దావా :
రెండు ఎత్తైన సమాంతర చెట్ల మధ్య పై భాగంలో చంద్రుడు మరియు దిగువన సూర్యుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ ఫోటో ఈ యాంగిల్లో తీయడానికి ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించాడు, మరియు 62 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. దీనిని ఇలా మళ్లీ 2035లో మాత్రమే చూడవచ్చు’ ఈ పోస్ట్కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ఉపయోగించి ఇంటర్నెట్లో ఈ ఫోటో కోసం శోధించాము. బెస్ హమితి అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోగా పేర్కొన్న theglobalartcompany.com లో ఈ ఫోటోను మేము కనుగొన్నాము.
ఈ ఫోటోను జనవరి 31, 2016 న హమితి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.

పూర్తిగా భిన్నమైన బ్యాక్గ్రౌండ్తో రెండు సమాంతర చెట్ల యొక్క మరొక ఫోటోను కూడా మేము కనుగొన్నాము.

ఈ వాదా ధృవీకరణ కోసం విశ్వాస్ న్యూస్ బెస్ హమితిని సంప్రదించింది. ‘నేను ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయిన అడోబ్ ఫోటోషాప్ ఉపయోగించి వైరల్ అవుతున్న ఈ ఫోటోను రూపొందించాను. దీనికి సంబంధించిన మొత్తం ప్రాసెసింగ్ యొక్క వీడియోను నా యూట్యూబ్ ఛానెల్లో కూడా అప్లోడ్ చేసాను. 16 కెమెరాలను ఉపయోగించడం, 62 రోజులు వెయిట్ చేసి ఈ ఫోటో తీశానంటూ జరుగుతున్న వాదన నిజం కాదు.’ అని హమితి తెలిపారు.
బాస్ హమితి యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్లో మేము ఈ వీడియోను కనుగొన్నాము, అక్కడ అతను అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి వైరల్ అవుతున్న ఈ ఫోటోను ఎలా రూపొందించాడో వివరంగా చెప్పాడు. ఈ వీడియో 2012 లో అప్లోడ్ చేయబడింది.
ఫేస్బుక్ యూజర్ శైలేంద్ర కుమార్ వైరల్ ఫోటో షేర్ చేసుకున్న చాలా మంది యూజర్లలో ఒకరు, ప్రొఫైల్ యొక్కసోషల్ స్కానింగ్లో అతనికి ఫేస్బుక్లో 1,047 మంది ఫాలోవర్లు ఉన్నారని, బీహార్లోని పాట్నాకు చెందిన వాడని నిర్ధారణ అయ్యింది.
निष्कर्ष: ‘ఈ ఫోటో ఈ యాంగిల్లో తీయడానికి ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించాడు, మరియు 62 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. దీనిని ఇలా మళ్లీ 2035లో మాత్రమే చూడవచ్చు’
- Claim Review : 'ఈ ఫోటో ఈ యాంగిల్లో తీయడానికి ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించాడు, మరియు 62 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. దీనిని ఇలా మళ్లీ 2035లో మాత్రమే చూడవచ్చు'
- Claimed By : FB User
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com