
హైదరాబాద్ (విశ్వాస్న్యూస్) : బీహర్ ఎన్నికల మ్యానిఫెస్టోగా ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో, బీజేపీకి ఓటు వేయని వారు కోవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా పొందలేరనే వాదనతో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విశ్వాస్న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుతోవ పట్టిస్తున్నదని తేలింది. భారతీయులందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ను కేంద్రమంత్రి ప్రకటించారని బీజేపీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
దావా :
బీహార్లో ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ను అందించేందుకు బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన కొద్ది సేపటికే, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్లో ఇలా ఉంది : “నో వోట్ నో వ్యాక్సిన్ ? … కాబట్టి భాజపాకు ఓటు వేసే వారికి ఉచిత వ్యాక్సిన్ లభిస్తుంది. ఓటు వేయకపోతే వారికి దక్కదు” అని ఆ పోస్ట్లో క్లెయిమ్ చేశారు.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
పలువురు ఇతర వినియోగదారులు కూడా ఇదే విధమైన వాదనలను తమ ఫేస్ బుక్ పోస్ట్ లో పంచుకున్నారు.
దర్యాప్తు :
బిజెపి బీహార్ ఎన్నికల మేనిఫెస్టో గురించి వార్తల కోసం ఇంటర్నెట్ లో వెతికాం.
దైనిక్ జాగరణ్లో ప్రచురితమైన ఒక కథనంలో ఇలా ఉంది, “కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పాట్నాలో అక్టోబర్ 22, గురువారం నాడు ఒక కీలక ప్రకటన చేశారు.. కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెద్ద ఎత్తున ప్రారంభమైన తరువాత, ఇది బీహార్లోని ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు పాట్నాలో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష పార్టీల విమర్శల మధ్య ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ వాగ్దానంపై సీతారామన్ ఒక స్టాండ్ తీసుకున్నారు. “అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఈ మహమ్మారిని ఉపయోగించుకు౦ది అని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బిజెపి సీనియర్ నేత సీతారామన్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఇది మేనిఫెస్టోలో చేసిన ప్రకటన అని అన్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమి చేయాలని అనుకుంటున్నారో ప్రకటించవచ్చు” అని దైనిక్ జాగరణ్ లో అక్టోబర్ 24న పోస్ట్ చేసిన ఒక కథనం పేర్కొంది.
ఈ వాదనను ధ్రువీకరించేందుకు విశ్వాస్ న్యూస్ బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గాను సంప్రదించింది. ఓటింగ్కు కోవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. “రాష్ట్ర బిజెపి నేతగా సీతారామన్ జీ ప్రకటించారు. అయితే, ఇవాళ మాత్రం కేంద్రమంత్రి భారతీయులందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ను ప్రకటించారు” అని బగ్గా చెప్పారు.
జాగరణ్ జోష్ లో ప్రచురితమైన ఒక వ్యాసం చూస్తే, కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి భారతీయులందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ను ప్రకటించారు.
ఫేస్బుక్ పేజీ అన్ ఆఫీకల్ కన్హయ్య కుమార్ సోషల్ స్కానింగ్ లో 1,59,493 మంది ఫాలోవర్లు ఉన్నట్లు తేలింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టిస్తోంది. భారతీయులందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ను కేంద్రమంత్రి ప్రకటించారని బీజేపీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.