
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రధాని నరేంద్రమోడిని ముఖేష్ అంబానీతో కలిసి ఆసుపత్రిలో చూడవచ్చు. ఈ ఫోటో ఇప్పుడు రైతు ఉద్యమంతో ఆపాదించి తప్పుడు దావాతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వాదన ప్రకారం, ప్రధానమంత్రి రైతులను కలవడం లేదు, కానీ ముఖేష్ అంబానీ మనవడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ను పరిశోధించి, ఆ ఫోటో 2014 నాటిదని కనుగొనడం జరిగింది. ఆ సమయంలో, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని ప్రారంభించడానికి పిఎం మోడీ ముంబైకి వెళ్లారు, అక్కడ ముఖేష్ అంబానీని కలిశారు.
దావా :
డిసెంబర్ 12 న, ఫేస్బుక్ యూజర్ RKS News ఒక ఫోటోను అప్లోడ్ చేస్తూ ఇలా రైటప్ ఇచ్చారు : ‘చలిలో వణుకుతూ కూర్చున్న రైతుల వద్దకు వెళ్ళడానికి సమయం లేదు. కానీ, మనవడు పుట్టినందుకు అంబానీని అభినందించడానికి ఆసుపత్రికి వెళ్లాడు.’
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖేష్ అంబానీ, నీతా అంబానీలను ఈ ఫోటోలో చూడవచ్చు. ఈ పోస్ట్కు సంబంధించిన అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్లో వైరల్ ఫోటోను అప్లోడ్ చేయడం జరిగింది. ‘ఒరిజినల్ పిక్చర్ ఇండియా ఇన్ఫో లైన్’ అనే వెబ్సైట్లో దీన్ని మేము కనుగొన్నాము. ఈ ఫోటో అక్టోబర్ 27, 2014 న అప్లోడ్ చేసిన వార్తలలో ఉపయోగించబడింది.
ఆ వార్తా కథనం ప్రకారం -శ్రీ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ప్రారంభోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ముంబై వెళ్లారు.
విశ్వాస్ న్యూస్ రిలయన్స్ గ్రూపుతో సంబంధం ఉన్న ప్రతినిధిని సంప్రదించింది. ఆ ఆసుపత్రి ప్రారంభించిన 2014 అక్టోబర్లో ఈ ఫోటో తీయబడిందని ఆయన మాకు చెప్పారు.
నకిలీ పోస్ట్ను అప్లోడ్ చేసిన వినియోగదారు ప్రొఫైల్ను మేము స్కాన్ చేసాము. RKS News అనే ఫేస్బుక్ పేజీని 33,000 మందికి పైగా ఫాలో అవుతున్నారని మేము కనుగొన్నాము.
निष्कर्ष: ఆరు సంవత్సరాల క్రితం ఆసుపత్రి ప్రారంభోత్సవం ఫోటో ఇటీవలి రైతు ఉద్యమానికి ఆపాదించి వైరల్ చేస్తున్నారు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.