వాస్తవ తనిఖీ: విమానాశ్రయములో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులకు స్వాగతం చెప్తున్న వీడియో ఒక అసత్యపు క్లెయిమ్ తో వైరల్ అవుతోంది
ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులు విమానాశ్రయము వద్ద ప్రకాష్ జావదేకర్ ను ఉపేక్షించారు. ప్రకాష్ జావదేకర్ ను ఉపేక్షించిన ఈ విద్యార్థులకు వందనం. జావదేకర్ గారి ముఖకవళికలు చూడండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి”.
- By Vishvas News
- Updated: March 16, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు స్వాగతం చెప్పటానికి బిజేపి నేత ప్రకాష్ జావదేకర్ ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారని, కాని విద్యార్థులు ఆయనను ఉపేక్షించారనే ఒక క్లెయిమ్ తో సోషల్ మీడియాపై ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో, విద్యార్థులకు పువ్వులు ఇస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తారు, కాని విద్యార్థులు ఆ పువ్వులను తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు. వీడియో గురించి చేయబడిన క్లెయిమ్ అసత్యము అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. వీడియోలో కనిపించే వ్యక్తి ప్రకాష్ జావదేకర్ కాదు, ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ యూజర్ ముస్కాన్ పటే ఈ చిత్రాన్ని పోస్ట్ చేసి ఇలా వ్రాశారు, “ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులు విమానాశ్రయము వద్ద ప్రకాష్ జావదేకర్ ను ఉపేక్షించారు. ప్రకాష్ జావదేకర్ ను ఉపేక్షించిన ఈ విద్యార్థులకు వందనం. జావదేకర్ గారి ముఖకవళికలు చూడండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి”.
వైరల్ పోస్ట్ లోని అంశాలు ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడ్డాయి. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి. మరొక యూజర్ ఆరిఫ్ ఖాన్ పఠాన్ కూడా తన ఖాతాపై ఇటువంటి క్లెయిమ్ నే షేర్ చేశారు.
దర్యాప్తు-
వైరల్ వీడియో గురించిన వాస్తవాలను తెలుసుకొనుటకు, మేము కొన్ని కీవర్డ్స్ తో గూగుల్ పై శోధించాము. మార్చ్ 2, 2022 న TV9 తెలుగు లైవ్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై అసలు వీడియో అప్లోడ్ చేయబడింది అని మేము కనుగొన్నాము. అసలు వీడియోలో విద్యార్థులకు స్వాగతం చెప్తున్న వ్యక్తి ప్రకాష్ జావదేకర్ కాదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని స్పష్టంగా చూడవచ్చు.
వీడియోలో మొదటి 45 క్షణాలలో, కిషన్ రెడ్డి విద్యార్థులకు పువ్వులు ఇవ్వడము చూడవచ్చు. కొంతమంది విద్యార్థులు పువ్వులు తీసుకోకుండా ధన్యవాదాలు చెప్తూ ముందుకు వెళ్తున్నారు, చాలామంది విద్యార్థులు ఆయన నుండి పువ్వులు తీసుకున్నారు. ANI వార్తా ఏజెన్సీ కూడా ఈ నివేదికను ప్రచురించింది.
దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తూ, మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యొక్క సామాజిక ఖాతాల స్కానింగ్ ప్రారంభించాము. ఈ తరుణములో, వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై వైరల్ వీడియోకు సంబంధించిన అనేక ట్వీట్స్ మాకు కనిపించాయి.
మరిన్ని వివరాల కొరకు, మేము దైనిక్ జాగరణ్ యొక్క నేషనల్ బ్యూరో చీఫ్ అయిన ఆశుతోష్ ఝా గారిని సంప్రదించాము. ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని ఆయన మాకు చెప్పారు. వీడియోలో కనిపించే వ్యక్తి కిషన్ రెడ్డి. ఆయన ఉక్రెయిన్ నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న విద్యార్థులకు స్వాగతం చెప్పటానికి అనేకమార్లు విమానాశ్రయానికి వెళ్ళారు. విమానాశ్రయములో విద్యార్థులకు మంత్రులు స్వాగతం చెప్తున్నారు. ప్రకాష్ జావదేకర్ ఎంపి, మంత్రికాదు.
వైరల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన యూజర్ ముస్కాన్ పటేల్ యొక్క సామాజిక నేపథ్యాన్ని విశ్వాస్ న్యూస్ తనిఖీ చేసింది. ఈ యూజర్ కు ఫేస్బుక్ పై 23000 కు పైగా ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము. ఆమె ధూలె లో నివసిస్తున్నారు.
निष्कर्ष: ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులు విమానాశ్రయము వద్ద ప్రకాష్ జావదేకర్ ను ఉపేక్షించారు. ప్రకాష్ జావదేకర్ ను ఉపేక్షించిన ఈ విద్యార్థులకు వందనం. జావదేకర్ గారి ముఖకవళికలు చూడండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి”.
- Claim Review : ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులు విమానాశ్రయము వద్ద ప్రకాష్ జావదేకర్ ను ఉపేక్షించారు. ప్రకాష్ జావదేకర్ ను ఉపేక్షించిన ఈ విద్యార్థులకు వందనం. జావదేకర్ గారి ముఖకవళికలు చూడండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి”.
- Claimed By : ముస్కాన్ పటేల్
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com