తక్షణ వాస్తవ తనిఖీ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫోటోలతో నకిలీ పోస్ట్ వైరల్
రాష్ట్రపతి గౌరవాన్ని దెబ్బతీసే ఫేస్బుక్ పోస్ట్ నకిలీ. ఈ ఫోటోలు తప్పుడు వాదనలతో వైరల్ అవుతున్నాయి.
- By Vishvas News
- Updated: December 17, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ప్రశ్నించిన ఓ పోస్ట్ మళ్లీ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్లో 3 చిత్రాల కోల్లెజ్ ఉంది, ఇందులో రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఈ పోస్ట్ను కూడా విశ్వాస్ బృందం ఇంతకు ముందే విచారించింది. దర్యాప్తులో, ఈ ఫోటోలతో చేసిన దావా నకిలీదని నిరూపించబడింది.
వైరల్ అవుతున్నది ఏంటి?
నీరజ్ యాదవ్ అనే ఫేస్బుక్ యూజర్ ఈ మూడు చిత్రాల కోల్లెజ్ను అప్లోడ్ చేసి, ‘రాష్ట్రపతి ఇంత బలవంతంగా ఉన్న దేశం. ఈ దేశ ఎన్నికల సంఘం, సిబిఐ ఎంత నిస్సహాయంగా ఉంటాయి?’
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడండి.
దర్యాప్తు :
ఈ పోస్ట్ను పరిశీలించడానికి, కోల్లెజ్లోని మూడు ఛాయాచిత్రాలను విడిగా పరిశీలించాము.
మొదటి ఛాయాచిత్రం :
అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్, నరేంద్ర మోడీ వైరల్ చిత్రాలపై పరిశోధన చేస్తున్నప్పుడు, తెలుగు యూట్యూబ్ ఛానల్ వి 6 న్యూస్ తెలుగులో ఒక వీడియో దొరికింది. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళులర్పించిన వీడియో ఇది. జనవరి 2018 లో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో, 5: 14 వ నిమిషంలో రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి ఒకరినొకరు చేతులతో పరస్పరం నమస్కరిస్తూ పలకరించుకోవడం చూడవచ్చు. వైరల్ ఫోటో కూడా ఈ సందర్భంలోనే తీసినది. అక్కడ నిలబడి ఉన్న నాయకులందరూ బాపుకు నివాళులర్పించి, తిరిగి వచ్చిన అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ను రెండుచేతులతో నమస్కరిస్తూ పలకరించారు. రాష్ట్రపతి అందరినీ అలాగే రెండు చేతులతో నమస్కరిస్తూ పలకరించారు. అదే సందర్భానికి భిన్నమైన యాంగిల్ పిక్చర్ ఇప్పుడు తప్పుడు సందర్భంతో వైరల్ అవుతోంది.

రెండవ ఫోటో :
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్లో అమిత్ షా, రామ్నాథ్ కోవింద్ వైరల్ చిత్రాలను శోధించాము. newindianexpress.comలో ఫోటోగ్రాఫర్ శేఖర్ యాదవ్ క్లిక్ చేసిన ఈ ఫోటోను మేము కనుగొన్నాము. ఫోటో శీర్షికలో ఇలా రైటప్ ఇచ్చారు. President-elect Ram Nath Kovind acknowledges the greeting of BJP president Amit Shah in New Delhi on Thursday | రామ్నాథ్ కోవింద్ దేశ తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు 20 జూలై 2017 న వార్తలు వచ్చాయి. పరిశోధన సమయంలో మేము మరొక చిత్రాన్ని కనుగొన్నాము. అందులో అమిత్ షా, రామ్నాథ్ కోవింద్ ఒకే విధమైన బట్టలు ధరించి ఉండడం చూడవచ్చు. ఇదే సందర్భంలో భిన్నమైన యాంగిల్లో తీసిన ఫోటో. రామ్నాథ్ కోవింద్ దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత 20 జూలై 2017 న జరిగిన కార్యక్రమంలో అమిత్ షా తనను అభినందించారని gettyimages.in లోని ఒక ఫోటో చెప్పబడింది. ఈ కార్యక్రమం న్యూ న్యూఢిల్లీలో జరిగింది. మీరు ఈ ఫొటోను ఇక్కడ చూడవచ్చు. జూలై 20 న కొత్త రాష్ట్రపతి పదవికి రామ్నాథ్ కోవింద్ ఎన్నికైనప్పటికీ, 25 జూలై 2017 న ప్రమాణ స్వీకారం చేశారు.


మూడవ ఫోటో :
అప్పుడు మేము యోగి ఆదిత్యనాథ్ మరియు అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ ఉన్న ఫోటోను పరిశీలించాము. ఈ ఫోటోను 24 జూన్ 2017 న ఇండియన్ ఎక్స్ప్రెస్కు సంబంధించిన ఒక వార్తలో ఉపయోగించారు. ఎన్డిఎ రాష్ట్రపతి అభ్యర్థి అయిన రామ్నాథ్ కోవింద్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. 24 జూన్ 2017నాటికి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థి మాత్రమే, రాష్ట్రపతి కాదు. కాబట్టి ఈ ఫోటోలో వైరల్ అవుతున్నట్లు అలాంటిదేమీ లేదు.

ఈ వైరల్ పోస్ట్ గురించి ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి తేజిందర్ బగ్గాను సంప్రదించగా… ఈ ఫోటోలు వేరే కోణంలో ఉన్నాయని చెప్పారు.
చివరగా, విశ్వాస్ న్యూస్ నీరజ్ యాదవ్ అనే ఫేస్ బుక్ యూజర్ ను సోషల్ స్కానింగ్ చేసింది. ఫేస్బుక్ ఖాతా ప్రకారం, అతను ఉత్తర ప్రదేశ్లోని జౌన్పూర్కు చెందినవాడు.

निष्कर्ष: రాష్ట్రపతి గౌరవాన్ని దెబ్బతీసే ఫేస్బుక్ పోస్ట్ నకిలీ. ఈ ఫోటోలు తప్పుడు వాదనలతో వైరల్ అవుతున్నాయి.
- Claim Review : 'రాష్ట్రపతి ఇంత బలవంతంగా ఉన్న దేశం. ఈ దేశ ఎన్నికల సంఘం, సిబిఐ ఎంత నిస్సహాయంగా ఉంటాయి?'
- Claimed By : Neeraj Yadav
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com