వాస్తవ తనిఖీ: రైతుల నిరసనల్లో ఆప్ పెయిడ్ లేబర్స్ పాల్గొనలేదు, తప్పుడు వాదనతో పాత వీడియో వైరల్
వైరల్ పోస్ట్ అబద్ధం. వైరల్ అవుతున్న వీడియో పాతది, మరియు ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి సంబంధించినది కాదు.
- By Vishvas News
- Updated: December 9, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : న్యూఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంలో పాల్గొనడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రోజువారీ వేతన కార్మికులకు డబ్బు చెల్లించి తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వీడియో పాతది మరియు ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి సంబంధించినది కాదని తేలింది.
దావా :
రైతుల ఉద్యమంలో పాల్గొనడానికి రోజువారీ కూలీ కార్మికులు వచ్చారని ఫేస్బుక్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో షేర్ చేసిన పోస్ట్లో యూజర్ ఆప్పై వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఫేస్బుక్ పోస్ట్ ఇక్కడ చూడవచ్చు.
ఆ పోస్ట్ అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
వైరల్ అవుతున్న వీడియోలో ఎవరూ శీతాకాలపు బట్టలు లేదా ఫేస్ మాస్క్ ధరించలేదని మేము గుర్తించాము. ఈ వీడియో ర్యాలీకి సంబంధించినదే. కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి సంబంధించిన ర్యాలీ కాదు.
మేము మొదట వైరల్ వీడియోను ఇన్విడ్ సాధనంలో అప్లోడ్ చేసాము, మరియు కీఫ్రేమ్లను సేకరించాము. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి మేము వాటిని ఇంటర్నెట్లో శోధించాము. ఢిల్లీ బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా చేసిన ట్వీట్లో ఈ వీడియో 26 మార్చి 2018 న కేజ్రీవాల్ హర్యానాలో చేపట్టిన ర్యాలీ అని పేర్కొన్నారు.
మేము ఈ వీడియోను ఆజ్తక్ మరియు inkhabar.com లో కూడా కనుగొన్నాము, ఇవి హిసార్లో AAP నిర్వహించిన ర్యాలీలో తీసిన వీడియో అని ధృవీకరించే వార్తా కథనాలు. అయితే, ర్యాలీలో పాల్గొన్నవారికి డబ్బులు చెల్లించారన్న ఆరోపణలను ఆప్ ఖండించింది.
ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆప్ నాయకుడు ఆర్తి చేసిన ట్వీట్ కూడా మాకు దొరికింది.
ఈ వాదనను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ ఆప్ నాయకుడు దీపక్ బాజ్పాయ్ను సంప్రదించింది. ‘ఈ వైరల్ వీడియో పాతది. ఈ ఆరోపణలు నిరాధారమైనవి. అప్పటి నుండి మేము ఇటువంటి వాదనలను ఖండిస్తున్నాము’ అని బాజ్పాయ్ చెప్పారు.
వైరల్ వాదనను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ శోభా జోషి సోషల్ స్కానింగ్లో ఆమె ఉత్తరాఖండ్లోని అల్మోరాలో నివసిస్తున్నట్లు తెలిసింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ అబద్ధం. వైరల్ అవుతున్న వీడియో పాతది, మరియు ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి సంబంధించినది కాదు.
- Claim Review : న్యూఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంలో పాల్గొనడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రోజువారీ వేతన కార్మికులకు డబ్బు చెల్లించి తీసుకొచ్చిందని ఆరోపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Claimed By : FB User Shobha Joshi
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com