
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : దేశ రాజధానిలో రైతుల నిరసనల మధ్య, ఆర్టికల్ 370 మరియు 35 ఎలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాసిన బ్యానర్తో కొంతమంది ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాశ్మీర్కు మద్దతుగా రైతులు కూడా నిరసన తెలుపుతున్నారనే వాదనతో ఇది షేర్ చేశారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ దావా నకిలీదని తేలింది. ఈ వైరల్ ఫోటో పాతది మరియు రైతుల నిరసనకు సంబంధించినది కాదు.
దావా :
ఫేస్బుక్ యూజర్ డాక్టర్ అభిలాషా ద్వివేది నవంబర్ 30 న ఒక ఫోటోను అప్లోడ్ చేసారు, ‘గ్రేట్… రైతు ఎజెండాలో 370, 35 ఎ కూడా చేర్చారు.’
ఫేస్బుక్లో చేసిన పోస్ట్ను ఇక్కడ పరిశీలించవచ్చు.
ఈ పోస్ట్ యొక్క అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
ఆర్టికల్ 370, 35 ఎను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు బ్యానర్ పట్టుకొని ఉండటాన్ని మేము గమనించాము. మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ఉపయోగించి ఇంటర్నెట్లో శోధించాము, మరియు 8 ఆగస్టు 2019 న శిరోమణి అకాలీదళ్ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేసిన పోస్ట్లో దీనిని కనుగొన్నాము.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నిరసన ఇటీవలే ప్రారంభమైంది, ఈ ఫోటో ఇటీవలి నిరసనలకు సంబంధించినది కాదని పాత పోస్ట్లోని తేదీ స్పష్టం చేస్తోంది.
విశ్వాస్ న్యూస్ ఈ దావాను ధృవీకరించడానికి దైనిక్ జాగరణ్ అమృత్సర్ రిపోర్టర్ నితిన్ ధీమన్ను సంప్రదించింది. ‘వైరల్ ఫోటోకు ఇటీవలి రైతుల నిరసనలతో సంబంధం లేదు. ఈ ఫోటో పాతది. ఆర్టికల్ 370 మరియు 35 ఎలను పునరుద్ధరించడానికి శిరోమణి అకాలీదళ్ నిరసన వ్యక్తం చేసినప్పుడు 2019 లో ఈ ఫోటో తీశారు.’ అని నితిన్ బదులిచ్చారు.
వైరల్ పోస్ట్ను షేర్ చేసుకున్న యూజర్ సోషల్ స్కానింగ్లో అతను ఢిల్లీకి చెందిన వాడని, అతని ఫేస్బుక్ అకౌంట్కు ఏడు వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారని తేలింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ అబద్ధం. ఇటీవలి రైతుల నిరసనల్లో తీసిన ఫోటో అంటూ పాత ఫోటో వైరల్ అవుతోంది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.