
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : భారత వైమానిక దళం (ఐఎఎఫ్) సుఖోయ్ SU-30 ఫైటర్ జెట్ను చైనా కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది మొదట ట్విట్టర్లో ఆ తరువాత ఫేస్బుక్లో బ్రేకింగ్ న్యూస్గా షేర్ చేయబడిందని మేము కనుగొన్నాము.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. అటువంటి వాదనలను IAF ఖండించింది.
దావా :
టిబెట్లో భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్) ఫైటర్ జెట్ సుఖోయ్ ఎస్యు -30ని చైనా కూల్చివేసిందని సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ పేర్కొంది. ఆర్కైవ్ చేసిన పోస్ట్ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
ఫేస్బుక్లో షేర్ చేసిన ఇలాంటి క్లెయిమ్లను కూడా మేము కనుగొన్నాము
దర్యాప్తు :
ఇంటర్నెట్లో మా శోధనలకు ఈ వైరల్ పోస్ట్కు సంబంధించి ఇటీవలి సమాచారం ఏదీ రాలేదు. అయితే సరిహద్దుల్లో IAF ఆపరేషన్కు సంబంధించిన వార్తా కథనాలను మేము కనుగొన్నాము.
సెప్టెంబర్ 25వ తేదీన దైనిక్ జాగరణ్ ప్రచురించిన ఒక వార్తా కథనంలో ఇలా రాశారు, ‘భారతదేశం మరియు చైనా మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలో, భారత వైమానిక దళం సరిహద్దుపై డేగకన్ను వేసి ఉంచింది’ భారత వైమానిక దళం సుఖోయ్-30 MKI యుద్ధ విమానాలను గులాం కాశ్మీర్ (పి.ఓ.కె.)లో మోహరించింది, మరియు చైనా సరిహద్దు సమీపంలో ఫార్వర్డ్ ఎయిర్ బేస్ను ఏర్పాటు చేసింది.’
భారతదేశ సరిహద్దులో సుఖోయ్ ఫైటర్జెట్ ఆపరేషన్ను ధృవీకరించే ANI ట్వీట్ కూడా మేము కనుగొన్నాము.
సుఖోయ్ – 30 ఫైటర్ జెట్ను చైనా కూల్చివేసిందా అని ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ భారత వైమానిక దళం అధికారులను సంప్రదించింది. వింగ్ కమాండర్ ఇంద్రాణిల్ నంది ఈ వాదనలను ఖండించారు, మరియు అలాంటి సంఘటన ఏదీ జరగలేదని మాకు చెప్పారు.
వైరల్ పోస్ట్ను షేర్ చేసుకున్న ఫేస్బుక్ పేజ్ ‘సర్దార్ దిల్నావాజ్ పిటిఐ’ యొక్క ప్రొఫైల్ను సోషల్ స్కానింగ్ చేయగా, ఆ పేజీకి 3,260 మంది ఫాలోవర్లు ఉన్నారని గుర్తించడం జరిగింది. 13 మే 2018 నుండి ఆ అకౌంట్ యాక్టివ్గా ఉంది.
निष्कर्ष: టిబెట్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సుఖోయ్-30 ఫైటర్ జెట్ను చైనా కూల్చివేసిందంటూ తిరుగుతున్న వైరల్ పోస్ట్ నకిలీ. ఈ వైరల్ దావాను IAF ఖండించింది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.