నిజ నిర్ధారణ : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మించిన వారు ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 200 కోట్లు విరాళం ఇవ్వలేదు, వైరల్ అయిన క్లెయిమ్ తప్పు
కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు రూ. 200 కోట్లు విరాళంగా ఇచ్చారనే వైరల్ క్లెయిమ్ తప్పు అని విశ్వాస్ న్యూస్ తన పరిశోధనలో తెలుసుకొన్నది.
- By Vishvas News
- Updated: April 15, 2022

న్యూఢిల్లీ ( విశ్వాస్ న్యూస్): విశ్వాస్ న్యూస్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ను చూసింది, అది కాశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మాతలు ప్రధానమంత్రి ఫండ్కి 200 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారన్న విషయం. విశ్వాస్ న్యూస్ తన విచారణలో ఆ క్లయిమ్ తప్పని తేల్చింది.
క్లెయిమ్
Facebook user Keshav Arora, had posted a picture on his profile and wrote: बधाई हो हिन्दूओ #प्रधानमंत्रीराहतकोष में #दाकश्मीरफाइल का पूरा संग्रह (कमाई) 200 करोड़ दान करने पर #विवेकअग्निहोत्री को केशव अरोड़ा प्रदेश अध्यक्ष हिंदू युवा वाहिनी का सैल्यूट The_Kshmir_Files THE_KSHMIR_FILES క్లయిమ్ : ఫేస్బుక్ వినియోగదారులు కేశవ్ అరోరా తన ప్రొఫైల్లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసి ఇలా వ్రాశారు: హిందువులకు అభినందనలు # కాశ్మీర్ ఫైల్స్ తమ మొత్తం ఆదాయం (సంపాదన) # 200 కోట్లని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చినందుకు # వివేక్ అగ్నిహోత్రి కేశవ్ అరోరా రాష్ట్ర అధ్యక్షుడు హిందూ యువ వాహినికి సెల్యూట్ ది కాశ్మీర్ ఫైల్స్ ది కాశ్మీర్ ఫైల్స్
పోస్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సినిమా నిర్మాతలను కూడా చూడవచ్చు.
పోస్ట్ మరియు ఆర్కైవ్ వర్షన్ను ఇక్కడ చూడండి.
విచారణ:
పోస్ట్తో పాటు షేర్ చేసిన చిత్రాన్ని వెతకడంతో విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది. మేము దాని కోసం ఒక సాధారణ రివర్స్ ఇమేజ్ పరిశోధన చేశాము.
మేము ANI డిజిటల్ వెరిఫై చేసిన హ్యాండిల్లో ఆ చిత్రాన్ని చూశాము.
ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 200 కోట్ల రూపాయల విరాళం గురించి ఆ ట్వీట్లో ఎక్కడా ప్రస్తావించలేదు.
జాగ్రన్ వార్తా రిపోర్ట్ను కూడా మేము చూశాము, అందులో ది కాశ్మీర్ ఫైల్స్ రూ. 200 కోట్ల క్లబ్లో చేరిందని, మహమ్మారి సమయంలో అత్యధికంగా వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచిందని పేర్కొంది. కానీ, నిర్మాతలు ఆ ఆదాయం మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ఆ రిపోర్ట్లో ఎక్కడా పేర్కొనలేదు.
మేము చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా ప్రొఫైల్లను కూడా చూశాము, అయన కూడా క్లెయిమ్కు సంబంధించిన విషయం ఏమీ షేర్ చేయలేదు.
విచారణలో తరువాతి భాగంగా, విశ్వాస్ న్యూస్ వివేక్ అగ్నిహోత్రి వ్యక్తిగత సహాయకుడు అమిత్ కత్వాల్ను సంప్రదించింది, ఆయన క్లయిమ్ను తిరస్కరిస్తూ సినిమా నిర్మాతలు అలాంటి విరాళం ఏమీ ఇవ్వలేదని ధృవీకరించారు.
దర్యాప్తు చివరి దశలో, మేము సమాచారాన్ని షేర్ చేసిన వినియోగదారుని సామాజిక నేపథ్యము తనిఖీ చేశాము, కేశవ్ అరోరా రాజస్థాన్కు చెందిన సామాజిక కార్యకర్త మరియు 4,031 మంది అతనిని అనుసరిస్తున్నారు.
निष्कर्ष: కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు రూ. 200 కోట్లు విరాళంగా ఇచ్చారనే వైరల్ క్లెయిమ్ తప్పు అని విశ్వాస్ న్యూస్ తన పరిశోధనలో తెలుసుకొన్నది.
- Claim Review : కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు ప్రధానమంత్రి ఫండ్కి రూ. 200 కోట్లు విరాళంగా ఇచ్చారు
- Claimed By : కేశవ్ అరోరా
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com