
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇది. వైరల్ ఫోటోలో రోడ్లపై సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ చూడవచ్చు, ప్రస్తుత రైతుల నిరసన కారణంగా ఢిల్లీలో 80 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయ్యిందని ప్రచారం చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఈ వాదన అవాస్తవమని తేల్చింది. రైతుల ఆందోళన పేరుతో వైరల్ అవుతున్న ట్రాఫిక్ జామ్ ఫోటో వాస్తవానికి గత సంవత్సరం ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా తీసినది. ఇది ఇప్పుడు నకిలీ దావాతో షేర్ చేయబడుతోంది.
దావా :
ఫేస్బుక్ యూజర్ ‘Krishanveer Singh’ ఈ వైరల్ ఫోటోను షేర్ చేశారు. ‘ఢిల్లీలో రైతుల ఉద్యమం ఫలితం 80 కిలోమీటర్ల పొడవైన జామ్.’
ఈ పోస్ట్ ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలతో ఈ ఫోటోను షేర్ చేశారు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ ఈ దావా యొక్క ప్రామాణికతను తనిఖీ చేయడానికి ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్లో శోధించింది.
మా శోధన సమయంలో, ‘టైమ్స్ నౌ’ టీవీ న్యూస్ ఛానెల్ యొక్క ఫేస్బుక్ పేజీలో, డిసెంబర్ 19, 2019న అప్లోడ్ చేసిన వీడియో బులెటిన్లో ఈ ఫోటోను కనుగొన్నాము.
వీడియో బులెటిన్తో పాటు అందించిన సమాచారం ప్రకారం, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ఫోటో ఇది. ఢిల్లీ పోలీసుల బార్కేడింగ్ కారణంగా గురుగ్రామ్ సరిహద్దులో ఈ జామ్ ఏర్పడింది, దీనికి సంబంధించిన మరిన్ని ఫోటోలను కూడా వీడియో బులెటిన్లో చూడవచ్చు.
దీనిని ధృవీకరించడానికి, తగిన కీలకపదాలతో పాటు.. మరోసారి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము, చాలా వార్తా కథనాలలో ఉపయోగించిన అదే ఫోటోను మేము ఆ ఫలితాల్లో కనుగొన్నాము. ఈ ఫోటోను 19 డిసెంబర్ 2019 న దైనిక్ జాగరణ్ వెబ్సైట్లో ప్రచురించిన వార్తా కథనంలో కూడా ఉపయోగించారు.
ఆ కథనం ప్రకారం, ‘పౌరసత్వ సవరణ బిల్లు (ఇప్పుడు చట్టం)కు వ్యతిరేకంగా నిరసనల కారణంగా ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.’
వివిధ ప్రదేశాలలో రైతుల నిరసనలను కవర్ చేస్తున్న దైనిక్ జాగరణ్ యొక్క ముగ్గురు కరస్పాండెంట్లను విశ్వాస్ న్యూస్ సంప్రదించింది. సింధు సరిహద్దులో కవర్ చేస్తున్న రిపోర్టర్ సోను రానా, న్యూఢిల్లీ-యుపి సరిహద్దులో రైతుల నిరసనపై రిపోర్ట్ చేస్తున్న ఆశిష్ గుప్తా, సీనియర్ రిపోర్టర్ షుజావుద్దీన్ లతో మాట్లాడటం జరిగింది. ఈ వైరల్ ఫోటో ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించినది కాదని వారు ధృవీకరించారు.
వైరల్ పోస్ట్ను షేర్ చేసిన యూజర్ తన ప్రొఫైల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా నివాసి.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ ఈ దావాపై దర్యాప్తు చేసి, వైరల్ పోస్ట్లోని వాదన తప్పు అని తేల్చింది. రైతు ఆందోళన పేరుతో వైరల్ అవుతున్న ట్రాఫిక్ జామ్ ఫోటో వాస్తవానికి గత సంవత్సరం ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా తీసినది. ఇది ఇప్పుడు నకిలీ దావాతో షేర్ చేయబడుతోంది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.