వాస్తవ తనిఖీ : వైరల్ వీడియోలో తమ గణిత ఉపాధ్యాయుడికి నివాళి అర్పిస్తున్న వ్యక్తి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కాదు.
ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ తనకు ఇష్టమైన గణిత ఉపాధ్యాయుడు మోలీ అబ్రహంకు నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్న వైరల్ పోస్ట్ అబద్ధం. ఈ వీడియోలో ఉన్నవారు ఐసి3 వ్యవస్థాపకుడు గణేష్ కోహ్లీ, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ కాదు.
- By Vishvas News
- Updated: August 16, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ మైసూర్ దాకా ప్రయాణించి తనకు ఇష్టమైన మ్యాథ్స్ టీచర్ మోలీ అబ్రహంకు నివాళి అర్పించారు. విశ్వాస్ న్యూస్ మొదట యూట్యూబ్లో 400 కి పైగా వీక్షణలతో ఈ వీడియోను గుర్తించింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదనలు అవాస్తవమని తేలింది. ఈ వీడియోలో ఉన్నది ఐసి3 వ్యవస్థాపకుడు గణేష్ కోహ్లీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కాదు.
దావా :
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక విద్యార్థి తన గణిత ఉపాధ్యాయుడితో ఉన్న అనుబంధంపై ఉద్వేగభరిత ప్రసంగం చేయడం చూడవచ్చు. ఇందులో కర్నాటకలోని మైసూర్లో ఉండే తన ఉపాధ్యాయుడి ఇంటికి చేసిన ప్రయాణం, తాను తీసుకెళ్లిన బహుమతి గురించి వివరించారు. ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సంస్థ సిఇఒ సుందర్ పిచాయ్ మైసూర్ వరకు ప్రయాణించి తనకు ఇష్టమైన మ్యాథ్స్ టీచర్ మోలీ అబ్రహంకు నివాళి అర్పిస్తున్నారనే వైరల్ వాదనతో ఈ వీడియో షేర్ చేయబడింది.
వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
మేము ఈ వీడియోను గమనించినప్పుడు, వీడియోలోని వ్యక్తి సుందర్ పిచాయ్ లాగా కనిపించడం లేదని స్పష్టంగా గుర్తించాము.

ఆ వీడియోలో ఉన్నది ఐసి3 కాన్ఫరెన్స్ చైర్మన్ గణేష్ కోహ్లీ అని అందులో ఒకచోట ఎడమవైపు దిగువన నేమ్ప్లేట్ను మనం చూడవచ్చు.

మేము ఇంటర్నెట్లో శోధించినప్పుడు, కోహ్లీకి సంబంధించిన వెబ్సైట్ను యాక్సెస్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుడు మరియు ఎంటర్ ప్రెన్యూయర్ అయిన గణేష్ కోహ్లీ ఐసీ3 మూవ్మెంట్ వ్యవస్థాపకుడు. ఆ సంస్థ 15 సంవత్సరాలలో ఒక లక్షా 75 వేల (1,75,000) ఉన్నత పాఠశాలలను ప్రభావితం చేసింది. పాఠశాలల్లో కెరీర్ మరియు కాలేజీ కౌన్సెలింగ్ అందించే వేదికను నిర్మించడానికి ఆయన తన సంస్థ ద్వారా తోడ్పడుతున్నారు.
మూడు సంవత్సరాల క్రితం పోస్ట్ చేసిన అసలు వీడియోను మేము కనుగొన్నాము.
మేము కోహ్లీని సంప్రదించినప్పుడు, తప్పుడు ప్రచారంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“ఈ తప్పుడు సమాచారం అలా వైరల్ అయినందుకు నాకు చాలా బాధ కలిగింది. ఇది పాత వీడియో, మరియు గత మూడేళ్లుగా యూట్యూబ్లో అందుబాటులో ఉంది.” అని కోహ్లీ విశ్వాస్న్యూస్కు చెప్పారు.
అంతేకాదు.. తన గురువును కలవడం చాలా ఉద్విగ్నమైన మరియు అందమైన అనుభవమని.. అలాగే, తాను వీడియో ద్వారా అందించిన సందేశం చాలా ముఖ్యమైనదని కోహ్లీ స్పష్టం చేశారు. కోహ్లీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
निष्कर्ष: ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ తనకు ఇష్టమైన గణిత ఉపాధ్యాయుడు మోలీ అబ్రహంకు నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్న వైరల్ పోస్ట్ అబద్ధం. ఈ వీడియోలో ఉన్నవారు ఐసి3 వ్యవస్థాపకుడు గణేష్ కోహ్లీ, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ కాదు.
- Claim Review : ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ మైసూర్ దాకా ప్రయాణించి తనకు ఇష్టమైన మ్యాథ్స్ టీచర్ మోలీ అబ్రహంకు నివాళి అర్పించారు.
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ఖిరీష్ ధర్మసీ
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com