వాస్తవ తనిఖీ: దుంగర్పూర్ దర్గా వద్ద రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్ పాత వీడియో తప్పుదారి పట్టించే దావాతో వైరల్ అవుతోంది
వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దుంగార్పూర్ లోని దర్గాను సందర్శించిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
- By Vishvas News
- Updated: November 24, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : దీపావళి కోసం రాజస్తాన్లో పటాకులను నిషేధించిన తరువాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ దర్గాలో ప్రార్థనలు చేయటానికి వెళ్ళారని ఆయన ఒక దర్గా నుండి బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుదారి పట్టించేదని వెల్లడయ్యింది. దుంగార్పూర్లోని దర్గాను గెహ్లాట్ సందర్శించిన పాత వీడియో ఇటీవల వైరల్గా మారింది.
దావా :
దీపావళి సందర్భంగా పటాకులను నిషేధించిన తరువాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ దర్గా నుంచి బయటకు వస్తున్న వైరల్ వీడియో షేర్ చేయబడుతోంది.
ఈ పోస్ట్కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
మేము మొదట వైరల్ వీడియోను ఇన్విడ్ టూల్లో అప్లోడ్ చేసాము, మరియు కీఫ్రేమ్లను సేకరించాము. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి మేము వాటిని ఇంటర్నెట్లో శోధించాము. 28 జనవరి 2019వ తేదీన న్యూస్ 53 నెట్వర్క్ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో యొక్క వైరల్ క్లిప్లను మేము కనుగొన్నాము, ‘రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్ ఈ రోజు గాలియాకోట్లోని సయీదీ ఫఖ్రుద్దీన్ షాహీద్ సమాధిని సందర్శించారు.’
ఇదే వీడియోను మేము ‘ఫస్ట్ ఇండియా న్యూస్ రాజస్థాన్‘ అనే యూట్యూబ్ ఛానెల్లో కూడా జనవరిలో అదే సమయంలో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము, గెహ్లాట్ గాలియాకోట్ మజార్ సందర్శన గురించి ఈ కథనంలో రాశారు.
ఈ వాదనను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ నయీదునియా రాజస్థాన్ కరస్పాండెంట్ మనీష్ కుమార్ను సంప్రదించింది. ‘ఈ వీడియో 2019 జనవరిలో అశోక్ గెహ్లాట్ దుంగర్పూర్ సందర్శించినప్పుడు తీసినది. ఆయన గాలియాకోట్ వెళ్లి కొన్ని దేవాలయాలలో మరియు ఫక్రుద్దీన్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. ఈ వీడియో ఫక్రుద్దీన్ దర్గాకు చెందినది’ అని కుమార్ చెప్పారు.
ఈ వైరల్ పోస్ట్ను షేర్ చేసిన చాలామంది యూజర్లలో ఫేస్బుక్ యూజర్ sachin khurana ఒకరు. అకౌంట్ సోషల్ స్కానింగ్లో అతను ముజఫర్ నగర్ నివాసి అని, మరియు ఫేస్బుక్లో 779 మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది.

निष्कर्ष: వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దుంగార్పూర్ లోని దర్గాను సందర్శించిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
- Claim Review : దీపావళి కోసం రాజస్తాన్లో పటాకులను నిషేధించిన తరువాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ దర్గాలో ప్రార్థనలు చేయటానికి వెళ్ళారంటూ ఓ వీడియో వైరల్
- Claimed By : Facebook user Sachin Khurana
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com