
హైదరాబాద్ (విశ్వా న్యూస్) : పోలింగ్ బూత్లో బక్కపల్చని, ఒంటిపై బట్టలు కూడాలేని మనిషి ఓటు వేస్తున్న ఫోటో బీహార్కు చెందినది అనే వాదనతో వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. వైరల్ అవుతున్న ఈ ఫోటోను 2014 లో అస్సాంలో తీసినట్లు మేము కనుగొన్నాము.
దావా :
ఫేస్బుక్ యూజర్ రిషబ్ త్రివేది అక్టోబర్ 29 న ‘India Against Hate & Violence’ అనే ఫేస్బుక్ గ్రూపులో పోలింగ్ బూత్లో బక్కపల్చని, ఒంటిపై బట్టలు కూడాలేని మనిషి ఓటు వేస్తున్న ఫోటోను అప్లోడ్ చేశాడు. తన పిల్లలు బాధపడకుండా ఉండాలని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలన్న ఆశతో ఓటు వేయడానికి వచ్చానని, బీహార్లో 15 ఏళ్ల నితీష్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని ఆ ఓటరు విమర్శించారు. ఫేస్బుక్ పోస్ట్ ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
ఈ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి ఈ ఫోటో అసలు మూలాన్ని కనుగొనడానికి మేము ఇంటర్నెట్లో శోధించాము. 19 నవంబర్ 2019 న janjwar.com ప్రచురించిన ఒక వ్యాసంలో ఈ ఫోటోను మేము కనుగొన్నాము. ఈ కథనం ప్రకారం వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తిని గిరిజనుడిగా గుర్తించాము.
13 ఏప్రిల్ 2014 న హిందూ పోస్ట్ చేసిన వ్యాసంలో కూడా ఈ ఫోటోను మేము కనుగొన్నాము. ఓటరును అస్సాంలోని కార్బీ ఆంగ్లాంగ్ జిల్లా తివా గిరిజనుడిగా గుర్తించడం జరిగింది. ఈ కథనంలో పేర్కొన్న పిక్చర్ క్రెడిట్ ద్వారా ఫోటోగ్రాఫర్ రితురాజ్ కన్వర్ను గుర్తించడం సులువయ్యింది.
ఈ దావాను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ రితురాజ్ కన్వర్ను సంప్రదించింది. వైరల్ ఫోటో బీహార్కు సంబంధించినది కాదని, ఆయన మాకు స్పష్టం చేశారు. ‘వైరల్ ఫోటో పాతది. ఇది ఇప్పుడు నకిలీ వాదనలతో షేర్ చేయబడుతోంది’, అని కన్వర్ తెలిపారు.
ఈ వైరల్ పోస్ట్ను షేర్ చేసుకున్న ఫేస్బుక్ గ్రూప్ను సోషల్ స్కానింగ్ చేయగా.. ఈ గ్రూపులో 719 మంది సభ్యులు ఉన్నారని తెలిసింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ నకిలీ. ఆరేళ్ల క్రితం అస్సాం ఎన్నికల్లో తీసిన ఫోటో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో తీసిందంటూ వైరల్ అయ్యింది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.