
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో, పెద్ద సంఖ్యలో ప్రజలు బహిరంగ ప్రదేశంలో గుమిగూడి ఉండటాన్ని చూడవచ్చు. ఇది ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించిన ఫోటో అని వైరల్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది. ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న కిసాన్ ఉద్యమం పేరిట వైరల్ అవుతున్న ఈ ఫోటో, 2018 లో మహారాష్ట్రలో జరిగిన ఉద్యమం నాటిది. ఇది ఇటీవలి కిసాన్ ఉద్యమం పేరిట సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.
వైరల్ అవుతున్నది ఏంటి ?
ట్విట్టర్ యూజర్ ‘Ujjal Adhikary‘ ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించినదని పేర్కొంటూ ఈ ఫోటోను షేర్ చేశారు.
ఈ పోస్ట్కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
చాలా మంది సోషల్మీడియా యూజర్లు ఇలాంటి వాదనలతో ఈ ఫోటోను షేర్ చేసుకున్నారు.
దర్యాప్తు :
ఈ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్లో శోధించగా, ది వైర్ వెబ్సైట్లో 23 జూన్ 2018న ప్రచురించిన వార్తా కథనంలో ఈ ఫోటోను కనుగొన్నాము, ఈ కథనాన్ని పి.సాయినాథ్ రాశారు. ఫోటోతో ఇచ్చిన క్రెడిట్ లైన్లో, ‘People’s Archive of Rural India’ అని పేర్కొన్నారు. మరింత శోధించిన తరువాత, ఈ ఫోటోను ‘People’s Archive of Rural India’ వెబ్సైట్లో కనుగొన్నాము. ఈ ఫోటో 22 జూన్ 2018 న ప్రచురించబడిన వ్యాసంలో ఉపయోగించబడింది. ఈ వ్యాసం 13 మార్చి 2018 న అదే వెబ్సైట్లో ప్రచురించబడిన మరొక వ్యాసంలో కూడా ఉపయోగించారు.
వ్యాసంలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫోటో మార్చి 12, 2018 న ముంబైలోని ఆజాద్ మైదానంలో జరిగిన రైతుల సభలో సేకరించారు. మరింత వివరణ కోసం ‘లాంగ్ మార్చ్’ అనే కీవర్డ్తో సోషల్ మీడియాలో శోధించినప్పుడు, 12 మార్చి 2018 న ఆల్ ఇండియా కిసాన్ సభ (@KisanSabha) యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో కొంచెం భిన్నమైన కోణంతో అదే ఫోటోను మేము కనుగొన్నాము. ఫోటోతో పాటు అందించిన సమాచారం ప్రకారం, ఈ ఫోటో ముంబైలోని ఆజాద్ మైదాన్లో తీసినది.
KisanLongMarch పేరుతో శోధిస్తున్నప్పుడు, ఈ ఉద్యమానికి సంబంధించిన వివిధ కోణాల్లో తీసిన మరిన్ని ఫోటోలు కూడా విభిన్న హ్యాండిల్స్పై ట్వీట్ చేయబడ్డాయి, ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా వాటిని చూడవచ్చు.
దీని తరువాత, మేము వార్తల శోధన సహాయం తీసుకున్నాము, ఆ శోధనలో ఈ ఉద్యమానికి సంబంధించిన అనేక కథనాలు కనుగొనబడ్డాయి. 12 మార్చి 2018 న ‘ఎకనామిక్ టైమ్స్’ వెబ్సైట్లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, మహారాష్ట్ర అసెంబ్లీ ముట్టడి కోసం ఈ రోజు (12 మార్చి 2018) ముంబైకి చేరుకున్న 40,000 మంది రైతులు. రుణమాఫీ డిమాండ్తో అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతుల కవాతు నాసిక్ నుంచి ముంబై చేరుకుంది.
ఎబిపి న్యూస్ వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్లో 12 మార్చి 2018 న అప్లోడ్ చేసిన వీడియోలో కూడా రైతులు ముంబైకి చేరుకున్న సమాచారం ఉంది.
వేర్వేరు ప్రదేశాలలో రైతుల ప్రదర్శనలను కవర్ చేస్తున్న మా సహోద్యోగులైన దైనిక్ జాగరణ్ కరస్పాండెంట్లు ముగ్గురిని మేము సంప్రదించాము. ఈ వైరల్ ఫోటో ప్రస్తుత రైతుల ఆందోళనకు సంబంధించినది కాదని.. సింధు సరిహద్దును కవర్ చేసే రిపోర్టర్ సోను రానా, ఢిల్లీ-యుపి సరిహద్దులో రైతుల పనితీరును నివేదిస్తున్న ఆశిష్ గుప్తా, సీనియర్ రిపోర్టర్ షుజావుద్దీన్ ధృవీకరించారు.
విశేషమేమిటంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్తో, రైతుల ఉద్యమం ఢిల్లీలో కొనసాగుతోంది. మరియు దీనితో సంబంధం లేని అనేక ఫోటోలు ఈ ఉద్యమం పేరిట వైరల్ అవుతున్నాయి, వాటిని కూడా విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. ఢిల్లీలో రైతు ఆందోళన కారణంగా 80 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, ఇంతకుముందు అలాంటి ఒక ఫోటో వైరల్ అయ్యింది. మా దర్యాప్తులో, ఆ వాదన తప్పు అని తేలింది, ఆ వాస్తవ తనిఖీ కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.
निष्कर्ष: వైరల్ పోస్ట్ అబద్ధం. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఢిల్లీలో కొనసాగుతున్న కిసాన్ ఆందోళన్ పేరిట.. 2018 లో మహారాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ ఉద్యమానికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.