వాస్తవ తనిఖీ: రోడ్డు ప్రమాదానికి గురైన అమ్మాయి వీడియో తప్పుడు దావాతో వైరల్
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పు అని తేలింది. దీని ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అమ్మాయి రోడ్డు ప్రమాదంలో మరణించింది. అత్యాచారం జరిగిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధం.
- By Vishvas News
- Updated: November 18, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : కొద్దిరోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చనిపోయిన అమ్మాయిని ఇందులో చూడవచ్చు. అలీగర్లో ఈ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారంటూ పోస్ట్లో వైరల్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పు అని తేలింది. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోలో ఉన్న బాలిక రోడ్డు ప్రమాదంలో మరణించింది. బాలికపై అత్యాచారం జరిగిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధం.
వైరల్ అవుతున్నది ఏంటి?
ఫేస్బుక్ యూజర్ అంకిత్ అంబేద్కర్ ఈ వీడియోను నవంబర్ 7వ తేదీన షేర్ చేస్తూ ఇలా వ్రాశారు : “# అలీగర్లో 3 ఏళ్ల బాలికను తేజ్వీర్ ప్రజాపతి అత్యాచారం చేసి చంపేశాడు. అన్ని # వాట్సాప్ గ్రూపుల్లోనూ దీనిని షేర్ చేయండి. అమ్మాయికి వీలైనంత త్వరగా న్యాయం జరగాలి, మరియు వీలైతే, మీ # ఫేస్బుక్ వాల్మీద కూడా ఈ పోస్ట్ అప్లోడ్ చేయండి.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
దర్యాప్తు :
మేము ఈ వీడియోను దర్యాప్తు కోసం ఇన్విడ్ టూల్లో అప్లోడ్ చేశాము. మరియు కీవర్డ్లతోనూ, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్లో కీఫ్రేమ్లతోనూ శోధించాము. ఒక యూజర్ అప్లోడ్ చేసిన ఈ వీడియోకు ప్రతిస్పందనగా, అలీఘర్ పోలీసుల నుండి మాకు ఒక ట్వీట్ కనిపించింది, ఆ వీడియోలో మూడేళ్ల బాలిక రోడ్డుప్రమాదంలో మరణించిందని పోలీసుల అధికారిక అకౌంట్ ద్వారా స్పష్టం చేయబడింది. “దయచేసి నిజం తెలియకుండా ట్వీట్లను చేసి కంగారు పెట్టవద్దు. నిజం తెలుసుకోండి…
ఈ కేసులో, రోడ్డు ప్రమాదంలో గాయాల కారణంగా బాలిక మరణించింది, దీనికి సంబంధించి అక్రబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అత్యాచారం వంటి సంఘటన జరగలేదు.’ అని రాశారు.
నవంబర్ 8వ తేదీన ఈ సంఘటనపై అలీఘర్ పోలీసులు ట్వీట్ చేశారు, దీనిలో ‘అకరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల బాలిక మరణానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది / ఆధారం లేనిది / నిజం తెలుసుకోండి.’ అని పేర్కొన్నారు.
ఇది కాకుండా, మరణించిన బాలిక తల్లి ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ కూడా అలీగర్ పోలీసుల ట్వీట్ లో చూడవచ్చు. వీడియోలో, బాలిక తల్లి తన కుమార్తె రోడ్డుప్రమాదం కారణంగా మరణించిందని చెప్పడం వినవచ్చు.
ఈ విషయంలో మరింత ధృవీకరణ కోసం మేము అలీగర్ క్రైమ్ విభాగం ఎస్పీ అరవింద్ కుమార్ను సంప్రదించాము. ‘ఈ విషయంలో ఇప్పటికే ఒక వివరణ జారీ చేయబడింది. బాలిక రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమెపై అత్యాచారం చేశాడనే వాదన అబద్ధం.” అని ఆయన చెప్పారు.
వైరల్ పోస్టును తప్పుడు దావాతో షేర్ చేసిన యూజర్ ‘అంకిత్ అంబేద్కర్’ ప్రొఫైల్ ప్రకారం, అతను ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్కు చెందినవాడు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పు అని తేలింది. దీని ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అమ్మాయి రోడ్డు ప్రమాదంలో మరణించింది. అత్యాచారం జరిగిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధం.
- Claim Review : అలీగర్లో తేజ్వీర్ ప్రజాపతి 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు.
- Claimed By : Ankit Ambedkar
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com