వాస్తవ తనిఖీ: రోడ్డు పక్కన అగ్నికి ఆహుతైన మహిళ వీడియో ఉత్తర ప్రదేశ్కు చెందినది కాదు, వైరల్ దావా అబద్ధం
ఈ వైరల్ పోస్ట్ అబద్ధం. ఈ వైరల్ వీడియో కర్ణాటకకు చెందినది, ఉత్తర ప్రదేశ్ది కాదు.
- By Vishvas News
- Updated: December 7, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సగం కాలిపోయిన ఒక మహిళ మృతదేహం ఉత్తర ప్రదేశ్కు చెందినదని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. వైరల్ వీడియో కర్ణాటకకు చెందినది.
దావా :
సోషల్ మీడియా యూజర్ Shyampur’er Gorbo Mamata చనిపోయిన ఒక మహిళ మృతదేహానికి సంబంధించిన వీడియోను అప్లోడ్ చేసారు, ‘ఇది భారతదేశం అని పిలవబడే మనదేశం. ఇది మహిళల స్వేచ్ఛనా? ఇలాగే, ఉత్తర ప్రదేశ్లో ఆడకూతుళ్లు చంపబడుతున్నారు!’
పోస్ట్ యొక్క అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
మేము మొదట వైరల్ వీడియోను ఇన్విడ్ టూల్లో అప్లోడ్ చేసాము, మరియు కీఫ్రేమ్లను సేకరించాము. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి మేము వాటిని ఇంటర్నెట్లో శోధించాము. నవంబర్ 8 న కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఉన్న పెరియపట్నంలో ఒక యువతికి నిప్పంటించిన వార్తా కథనాన్ని కనుగొన్నాము. saakshatv.comలో కన్నడ భాషలో ప్రచురించిన వార్తా కథనంలో ఈ వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్లు కనిపించాయి.
ಬೆಚ್ಚಿಬಿದ್ದ ಪಿರಿಯಾಪಟ್ಟಣ: ಹಾಡಹಗಲೇ ಬೆಂಕಿ ಹಚ್ಚಿ ಯುವತಿಯ ಕೊಲೆ..!
నవంబర్ 9 న టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ప్రచురించిన మరో వార్తను కూడా మేము కనుగొన్నాము. ఆదివారం తెల్లవారు జామున పెరియపట్న పోలీసు స్టేషన్ పరిధిలోని కెల్లూరు గ్రామంలో రోడ్డు పక్కన ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. మోకాలి నుంచి తల మధ్య శరీరం పూర్తిగా కాలిపోయింది. బాధితురాలిని వేరే చోట హత్య చేసి అక్కడికి తీసుకువచ్చి దహనం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను ఎక్కడ, ఎందుకు, ఎవరు హత్య చేశారో తెలియదు’. అని ఆ కథనంలో పేర్కొన్నారు.
ది హిందూలో ఈ వార్తకు సంబంధించిన అప్డేట్ న్యూస్ కూడా కనిపించింది. ‘పెరియపట్నలోని కెల్లూర్ గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్న మిస్టరీని మైసూర్ జిల్లా పోలీసులు ఛేదించారు. పోలీసులు ఆ మహిళ యొక్క ప్రేమికుడిని మరియు ఆమె సహచరుడిని అరెస్టు చేశారు.’ అని ఆ కథనంలో రాశారు.
ఈ వాదనను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ మైసూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సిబి రిష్యంత్ను సంప్రదించింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగిందని, పెరియపట్నలోని కెల్లూర్ గ్రామంలో మృతదేహం లభించిందని, ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఆయన వివరించారు.
వైరల్ పోస్ట్ను షేర్ చేసిన Shyampur’er Gorbo Mamata యొక్క ఫేస్బుక్ పేజీ సోషల్ స్కానింగ్లో 12,953 మంది ఫాలోవర్లు ఉన్నారని గుర్తించడం జరిగింది.

निष्कर्ष: ఈ వైరల్ పోస్ట్ అబద్ధం. ఈ వైరల్ వీడియో కర్ణాటకకు చెందినది, ఉత్తర ప్రదేశ్ది కాదు.
- Claim Review : 'ఇది భారతదేశం అని పిలవబడే మనదేశం. ఇది మహిళల స్వేచ్ఛనా? ఇలాగే, ఉత్తర ప్రదేశ్లో ఆడకూతుళ్లు చంపబడుతున్నారు!'
- Claimed By : FB User Shyampur'er Gorbo Mamata
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com