
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : వ్యాపారవేత్త అదానీ భార్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంగి మరీ నమస్కరిస్తున్నారంటూ ఒక ఫోటో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ ఇంతకు ముందు ఈ వైరల్ పోస్ట్ పై దర్యాప్తు చేసింది. ఆ సమయంలో మా దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ అబద్ధమని నిరూపించబడింది. ఫోటోలో ఉన్నది అదానీ భార్య కాదు. ఈ ఫోటోలో ఉన్న మహిళ తుమ్కూర్ యొక్క మాజీ మేయర్ గీతా రుద్రేష్.
వైరల్ అవుతున్నది ఏంటి?
ఫేస్బుక్ యూజర్ సత్యశీల్ చావేర్ నవంబర్ 3వ తేదీన తన వాల్పై ఈ పోస్ట్ను అప్లోడ్ చేశారు.
వైరల్ పోస్ట్లో ఏముందో ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
వైరల్ పోస్ట్ అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ కూడా ఇంతకుముందు ఇలాంటి వైరల్ పోస్టులపై దర్యాప్తు చేసింది. ఆ సమయంలో, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా శోధిస్తే.. రాహుల్ కౌశిక్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన ట్వీట్ కనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు వచ్చిన సమయంలో తుమ్కూర్ మేయర్ గీతా రుద్రేష్ను ప్రధానమంత్రి మోడీ పలకరించిన అసలు ఫోటోను 25 సెప్టెంబర్ 2014 న ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్లో శోధించినప్పుడు, 2014 లో కర్ణాటకలోని తుమ్కూర్లో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చారని మాకు తెలిసింది. ఈ ఫోటో ఆసమయంలో తీసినది. ఇప్పుడు ఇది మరోసారి నకిలీ దావాలతో వైరల్ అవుతోంది.
మరింత సమాచారం కోసం విశ్వాస్ న్యూస్ బిజెపి ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ బగ్గాను సంప్రదించింది. ‘ఈ చిత్రం ఇంతకు ముందు చాలాసార్లు వైరల్ అయ్యింది. దాని వాదన పూర్తిగా అబద్ధం. చిత్రంలో అదానీ భార్య లేదు. ” అని ఆయన చెప్పారు.
దర్యాప్తునకు సంబంధించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి.
చివరగా మేము ఫేస్బుక్ యూజర్ సత్యశీల్ చావేర్ అకౌంట్ను తనిఖీ చేసాము. ఈ యూజర్ మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందినవారని తెలిసింది. ఈ యూజర్కు ఫేస్బుక్లో 849 మంది ఫాలోవర్లు ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీదని తేలింది. ఈ చిత్రంలో పిఎం మోడీ అదానీ భార్య ముందు కాకుండా తుమ్కూర్ మాజీ మేయర్ ముందు గౌరవంగా నమస్కరించారు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.