వాస్తవ తనిఖీ: సిబిఎస్ఇ సిలబస్ను 50 శాతానికి తగ్గించలేదు, తప్పుదారి పట్టిస్తోన్న వైరల్ పోస్ట్
సిబిఎస్ఇ సిలబస్ను 50 శాతానికి తగ్గించిందని పేర్కొన్న పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ ఏడాది జూలైలో సిబిఎస్ఇ సిలబస్ను 30 శాతం తగ్గించి, అదనంగా మరో 20 శాతం తగ్గించాలని యోచించింది, అయితే ఈ కథనం పోస్ట్ చేసే సమయానికి ఆ నిర్ణయం ఖరారు కాలేదు.
- By Vishvas News
- Updated: November 3, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో ఓ యూట్యూబ్ ఛానెల్ లింక్ వైరల్ అవుతోంది. ఈ యూట్యూబ్ వీడియోతో జతచేయబడిన శీర్షిక మరియు వివరణ చూస్తే.. సిబిఎస్ఇ 2021 పరీక్షలకు సిలబస్ను 50 శాతానికి తగ్గించిందని పేర్కొంది.
విశ్వాస్ న్యూస్ ఈ వీడియో యొక్క శీర్షిక మరియు వివరణ తప్పుదారి పట్టించేదిగా గుర్తించింది. సిబిఎస్ఇ తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు సిలబస్ను 30 శాతం తగ్గించింది.
దావా :
యూట్యూబ్ ఛానల్ ‘APNA COOL SCHOOL’ వీడియోను ఒక శీర్షికతో పోస్ట్ చేసింది – ‘CBSE 2021 పరీక్షలకు 50% సిలబస్ను తగ్గించింది | 50% సిలబస్ తగ్గించిన CBSE | సిబిఎస్ఇ సిలబస్ 50% తగ్గింపు’
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్బాట్ (9599299372) లో వాస్తవ-తనిఖీ అభ్యర్థిస్తూ ఈ పోస్ట్ను స్వీకరించింది.
దర్యాప్తు :
ఈ వైరల్ పోస్టుకు సంబంధించిన కీలకపదాలతో ఇంటర్నెట్లో శోధించడం ద్వారా మేము మా దర్యాప్తును ప్రారంభించాము. CBSE 50 శాతం సిలబస్ను తగ్గించినట్లు మేము ఏ మీడియా కథనాలను కనుగొనలేదు. అయితే, జూలైలో సిబిఎస్ఇ 30 శాతం సిలబస్ను తగ్గించిందని, ఇప్పుడు పాఠశాలలు ఇంకా మూసివేయబడినందున 20 శాతం ఎక్కువ తగ్గించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా ప్లాట్ఫామ్లపై కథనాలు కనిపించాయి. అయితే, అదనంగా 20 శాతం సిలబస్ను తగ్గించే నిర్ణయాన్ని బోర్డు ఖరారు చేయలేదు.
మేము ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా విన్నాము, మరియు వీడియోలోని వాయిస్ఓవర్ కూడా సిబిఎస్ఇ 30 శాతం సిలబస్ను తగ్గించిందని, ఇప్పుడు మరో 20 శాతం ఎక్కువ తగ్గించాలని యోచిస్తోందని చదివి వినిపించారు. కానీ వీడియో యొక్క శీర్షిక మరియు వివరణ మాత్రం తప్పుదారి పట్టించేదిగా పెట్టారు.
ఈ ఏడాది జూలై 7వ తేదీన విడుదలైన సిబిఎస్ఇ యొక్క అధికారిక వెబ్సైట్లో ఒక సర్క్యులర్ను మేము కనుగొన్నాము. ఈ సర్క్యులర్ సిలబస్లో 30 శాతం తగ్గింపు గురించి తెలియజేసింది. 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు విద్యార్థులు సవరించిన సిలబస్ను కనుగొన గల లింక్ను కూడా మేము కనుగొన్నాము. సవరించిన సిలబస్ మరియు అంతర్గత అంచనాకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ జూలై 15 న విడుదల చేసిన మరో సర్క్యులర్ను కూడా మేము కనుగొన్నాము.
విశ్వాస్ న్యూస్ సిబిఎస్ఇ హెల్ప్లైన్ను సంప్రదించింది. జూలైలో బోర్డు 30 శాతం సిలబస్ను తగ్గించినట్లు హెల్ప్లైన్ అధికారి రాజేష్ శర్మ స్పష్టం చేశారు. సిలబస్లో 20 శాతం తగ్గించాలని బోర్డు యోచిస్తోంది, అయితే నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది.. అని ఆయన చెప్పారు.
ఈ పోస్ట్ యూట్యూబ్లో ‘APNA COOL SCHOOL’ అనే ఛానెల్ ద్వారా షేర్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు, ఈ ఛానెల్కు 16,600 మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారని మేము కనుగొన్నాము.
निष्कर्ष: సిబిఎస్ఇ సిలబస్ను 50 శాతానికి తగ్గించిందని పేర్కొన్న పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ ఏడాది జూలైలో సిబిఎస్ఇ సిలబస్ను 30 శాతం తగ్గించి, అదనంగా మరో 20 శాతం తగ్గించాలని యోచించింది, అయితే ఈ కథనం పోస్ట్ చేసే సమయానికి ఆ నిర్ణయం ఖరారు కాలేదు.
- Claim Review : సిబిఎస్ఇ సిలబస్లో 50 శాతం తగ్గించింది
- Claimed By : Youtube Channel: APNA COOL SCHOOL
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com