
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఉగ్రవాది హఫీజ్ సయీద్తో ప్రధాని నరేంద్ర మోడీ కరచాలనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ కూడా ఈ ఫోటోతో కూడిన వైరల్ పోస్ట్ను ఇంతకు ముందే పరిశోధించింది, దీనిలో వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేయబడిందని మేము కనుగొన్నాము. వాస్తవ ఫోటోగ్రాఫ్లో నరేంద్ర మోడీ నవాజ్ షరీఫ్తో కరచాలనం చేశారు.
వైరల్ అవుతున్నది ఏంటి ?
ఈ పోస్ట్పై వాస్తవ తనిఖీకోసం విశ్వాస్ న్యూస్ వాట్సాప్ చాట్బాట్ నంబర్ 9599299372 కు అభ్యర్థన కూడా వచ్చింది. ఈ పోస్ట్లో ఒక ఫోటో ఉంది, దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాది హఫీజ్ సయీద్తో కరచాలనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ”భారతదేశానికి నిజమైన దేశద్రోహి ఎవరు? సంఘ్, బిజెపి ఎందుకు మౌనంగా ఉన్నాయి? అజామ్ ఖాన్ పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ మరియు మోడీ భేటీకి సంబంధించిన ఫోటోలను విడుదల చేశాడు, మరి ఎవరు దేశద్రోహి అనేది చూడండి.” అంటూ ఆ ఫోటోకు రైటప్ ఇచ్చారు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ మొదట గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయంతో వైరల్ ఇమేజ్ను శోధించింది, అప్పుడు వైరల్ ఫోటోను ట్యాంపర్ చేసినట్లు మేము కనుగొన్నాము. మాకు వాస్తవ ఫోటో సోర్స్ దొరికింది. అందులో మోడీ హఫీజ్ సయీద్తో కాకుండా నవాజ్ షరీఫ్తో కరచాలనం చేస్తున్నాడు.
మేము చాలా మీడియా కథనాలలో అసలు ఫోటోను కనుగొన్నాము. ఈ ఫోటో 25 డిసెంబర్ 2015 న తీశారు, మోడీ ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా పాకిస్తాన్కు వెళ్లి, నవాజ్ షరీఫ్ని కలిశారు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు.
పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఫేస్బుక్ పోస్ట్ కూడా మాకు లభించింది. వాస్తవ ఫోటోను పాకిస్తాన్ ప్రభుత్వం డిసెంబర్ 25, 2015 నాడు 9:50 నిమిషాలకు అప్లోడ్ చేసింది. దీనితో పాటు, ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారని ఆ రిపోర్ట్ పేర్కొంది.
ఈ వైరల్ పోస్ట్కు సంబంధించిన పూర్తి వాస్తవ తనిఖీ కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.
ఈ ఫోటోపై స్పష్టత కోసం విశ్వాస్ న్యూస్ బిజెపి ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ బగ్గాను సంప్రదించింది. వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేయబడిందని, ఆ ఫోటోతో పాటు వైరల్ అవుతున్న వాదన కూడా అబద్ధమని ఆయన చెప్పారు.
निष्कर्ष: ఈ ఫోటోలో హఫీజ్ సయీద్కు నరేంద్రమోడీ షేక్హ్యాండ్ ఇస్తున్నాడు. కానీ, వాస్తవ ఫోటోలో మాత్రం మోడీ నవాజ్ షరీఫ్తో కరచాలనం చేస్తున్నాడు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.