
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ముస్లింల ఓటుహక్కును హరించేలా డెన్మార్క్ ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించినట్లు సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ తిరుగుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుదారి పట్టించేదని తెలిసింది.
దావా :
ఫేస్బుక్ పేజీ స్వరాజ్ భారత్లో ఒక పోస్ట్ను షేర్ చేశారు. ‘#Breaking- డెన్మార్క్లో ముస్లిం సమాజానికి ఓటు హక్కును రద్దు చేసే చట్టం ఆమోదించబడింది’ అని ఆ పోస్ట్కు రైటప్ ఇచ్చారు. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ను ఇక్కడ చూడవచ్చు.
archive.today/hl1VE
విశ్వాస్ న్యూస్ తన ఫాక్ట్ చెకింగ్ వాట్సాప్ చాట్బాట్ (+91 95992 99372) లో ఫాక్ట్ చెక్ కోసం ఈ దావాను అందుకుంది.
దర్యాప్తు :
వైరల్ దావా గురించిన వార్తల కోసం మేము ఇంటర్నెట్లో శోధించాము, కాని సమాచారాన్ని ధృవీకరించే ప్రామాణికమైన మీడియా నివేదికలు ఏవీ మాకు దొరకలేదు. అయితే, 2019 లో ప్రచురించబడిన కొన్ని పాత వార్తా కథనాలను మేము కనుగొన్నాము.
దీని ప్రకారం, ఇస్లామిక్ స్టేట్ వంటి మిలిటెంట్ గ్రూపుల కోసం పోరాడటానికి విదేశాలకు వెళ్ళిన డానిష్ పౌరులకు పౌరసత్వాన్ని రద్దు చేయడానికి డెన్మార్క్ ఒక చట్టాన్ని రూపొందించింది. ప్రతిపాదిత కొత్త చట్టం… కోర్టు ఆదేశాలు లేకుండా తమ డానిష్ పౌరులు.. మరొక జాతీయతను కలిగి విదేశాలలో ఉన్న వాళ్ల పౌరసత్వాన్ని తొలగించడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది.
డెన్మార్క్లో ఎవరు ఓటు వేయగలుగుతారు?
డానిష్ ప్రభుత్వ వెబ్సైట్లోని సమాచారం ప్రకారం, డెన్మార్క్, గ్రీన్లాడ్ మరియు ఫారో దీవులకు చెందిన ప్రతి పౌరుడు మరియు 18 ఏళ్లు పైబడిన వారు ఓటు వేయవచ్చు.
ఈ వాదనను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ భారతదేశంలోని డానిష్ రాయబార కార్యాలయాన్ని ఇ-మెయిల్ ద్వారా సంప్రదించింది. దీనికి ప్రతిస్పందనగా మినిస్టర్ కౌన్సిలర్ స్టీన్ మాల్తే హాన్సెన్ ఈ వైరల్ దావా సరైనది కాదని, అలాంటి చట్టం ఏదీ ఆమోదించబడలేదని పేర్కొన్నారు.
వైరల్ దావాను పంచుకున్న ఫేస్బుక్ పేజీ యొక్క సోషల్ స్కానింగ్లో 5,924 మంది ఆ పేజీకి ఫాలోవర్లు ఉన్నారని తెలిసింది.
निष्कर्ष: వైరల్ దావా తప్పుదారి పట్టించేది. ముస్లిం సమాజం యొక్క ఓటు హక్కును హరించడానికి డెన్మార్క్ ప్రభుత్వం ఎటువంటి చట్టాలను రూపొందించలేదు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.